ఎడమ చేతి బొటన వలికి ఫ్రాక్చర్ కారణంగా మొదటి టెస్టుకు దూరమై యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (Shubman Gill) అడిలైడ్లో జరిగే రెండో టెస్టుకు (Adelaide Test) కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీ మొదటి టెస్టుకు దూరమైన గిల్.. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ రెండో టెస్టుకు తగినంత ప్రాక్టీస్ అవసరమని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోందట. అందుకే అతడిని రెండో టెస్టుకు తీసుకోవడం లేదని సమాచారం.
ఒకవేళ రెండో టెస్టుకు శుభ్మన్ దూరమైతే జైస్వాల్తో కలిసి రెండో టెస్టులోనూ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అయితే పెర్త్ టెస్టులో దారుణంగా విఫలమైన దేవ్దత్ పడిక్కల్ను పక్కనపెట్టాలని మేనేజ్మెంట్ భావిస్తే.. రోహిత్ శర్మ ప్లేయింగ్ 11లోకి వస్తాడు. జైస్వాల్తో కలిసి ఓపెనింగ్కు దిగితే కేఎల్ రాహుల్ వన్ డౌన్లో వస్తాడు.
భారత్, ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మకంగా భావించే బోర్డర్ గవాస్కర్ ట్రోపీ (Border Gavaskar Trophy) మొదటి టెస్టులో భారత్ దుమ్ముదులిపింది. ఆతిథ్య జట్టును 295 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసింది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 150 పరుగులే చేసిన టీమిండియా.. ఈ తర్వాత 104 రన్స్కే కంగారూ జట్టును కట్టడి చేసింది. కెప్టెన్ బుమ్రా తన పేస్ బౌలింగ్తో ఆస్ట్రేలియా బ్యాటర్లను బెంబేలెత్తించి 5 వికెట్లు తీశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో జైశ్వాల్, విరాట్ కోహ్లీ సెంచరీలకు తోడు కేఎల్ రాహుల్ రాణించడంతో భారత్ 487 రన్స్ చేసి డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బుమ్రా, సిరాజ్,హర్షిత్ రాణా చెలరేగడంతో కంగారూ జట్టు 238 రన్స్ చేసి ఆలౌట్ అవడంతో భారత్ 295 రన్స్ తేడాతో విజయం సాధించింది.








