Breaking News : తిరుమల లడ్డూ ఘటనపై సిట్ దర్యాప్తునకు బ్రేక్

Mana Enadu : తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఏపీ సర్కార్ (Ap Govt) సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్​ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు (Supreme Court)లో సాగుతున్న దృష్ట్యా, రాష్ట్ర న్యాయవాదుల సూచనల మేరకు దర్యాప్తు (SIT Inquiry) తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

సిట్ దర్యాప్తునకు బ్రేక్

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగానే సిట్ దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు అక్టోబర్ 3వ తేదీ వరకూ సిట్ (SIT On Tirumala Laddu) దర్యాప్తు అపివేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ మూడో తేదీన ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ తర్వాత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా సిట్ దర్యాప్తు జరపనుంది.

దేవుణ్నైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి

మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ (Tirumala Laddu Issue)పై దాఖలైన పిటిషన్లపై సోమవారం రోజున (సెప్టెంబరు 30వ తేదీ) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూ వ్యవహారం (Tirumala Laddu Ghee)పై సిట్​ కొనసాగించాలా? లేదా అని సహకారం ఇవ్వాలని ఎస్​జీని సుప్రీంకోర్టు కోరింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని .. స్వతంత్ర విచారణ జరపాలా? లేదా? చెప్పాలని కేంద్రాన్ని అడిగింది. సిట్​ను కొనసాగించాలో లేదో చెప్పాలని పేర్కొంది.

గురువారానికి విచారణ వాయిదా

“గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు (Animal Ghee) వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారు. ఇలాంటి కల్తీ నెయ్యిని ఎప్పుడూ ఉపయోగించలేదని టీటీడీ ఈఓ (TTD EO) పేర్కొన్నట్లు కొన్ని పత్రికా కథనాలు కూడా చూపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా, ఈ విషయంపై విచారణ అవసరం. దర్యాప్తు ప్రక్రియలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ప్రజల మనోభావాల్ని ప్రభావితం చేసేలా రాజ్యాంగపరమైన ఉన్నత స్థాయిలో ఉన్న వారు ప్రకటన చేయడం తగదు.” అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటని టీటీడీని ప్రశ్నిస్తూ.. జస్టిస్​ బి.ఆర్​.గవాయ్, జస్టిస్​ కె.వి. విశ్వనాథన్​తో కూడిన ధర్మాసనం విచారణను గురువారానికి  వాయిదా వేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *