కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde

సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్ ప్రచారం చేయడానికి చాలా డబ్బు తగలేస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్(Shocking Comments) చేసింది. పూజా ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించింది. సోషల్ మీడియాలో తన గురించి ఎన్నో రకాలుగా వచ్చిన ట్రోలింగ్స్(Trolling) తనను, తన కుటుంబాన్ని బాధ పెట్టాయని ఆవేదనను వ్యక్తం చేసింది.

Pooja Hegde Birthday: 5 flop films including Shehzada Dodged by Thalapathy  69 actress

తర్వాత దానిని పట్టించుకోవడం మానేశా

అంతేకాకుండా నటిగా తన ఎదుగుదలను దెబ్బ కొట్టడానికి కొంతమంది కోట్ల రూపాయలు ఇచ్చి ట్రోలింగ్ చేయించారని ఈ సందర్భంగా పూజ హెగ్డే సంచలన విషయాన్ని బయట పెట్టింది. వాళ్లు కొన్ని మీమ్ పేజెస్‌ను సంప్రదించగా “మిమ్మల్ని ట్రోల్ చేయడానికి ఇంత పే చేస్తున్నారు. మీరు గనక ఈ ట్రోలింగ్‌ని ఆపాలన్నా, లేదంటే తిరిగి ఫైట్(Fight) చేయాలన్నా ఇంత ఖర్చవుతుంది” అని ముఖం మీద చెప్పేశారట. ఇదంతా తెలుసుకున్న తర్వాత ట్రోలింగ్‌ను పట్టించుకోవడం మానేశానని, ఇప్పుడు తన దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉందని వెల్లడించింది.

Pooja Hegde admits she was a victim of targeted trolling: 'If you'd like to  stop it, this is the amount' – News Mania

ఆమెను టార్గెట్ చేసింది ఎవరు?

అయితే తాను ఎవ్వరికీ ఎలాంటి చెడు చేయలేదని, అయినప్పటికీ ఎందుకు తనపై ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో తెలియట్లేదని ఆవేదనను వ్యక్తం చేసింది. కానీ తనను టార్గెట్ చేయడానికి ట్రోలర్స్‌కి భారీగా డబ్బును ఖర్చుపెట్టిన వ్యక్తి ఎవరు? అన్న విషయాన్ని మాత్రం పూజా బయట పెట్టలేదు. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో పూజా హెగ్డే ఎవరిని బ్లేమ్ చేస్తోంది? ఆమెను టార్గెట్ చేసింది ఎవరు? అన్నది చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు(Telugu), తమిళ(Tamil) భాషల్లో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *