మహేశ్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్లో ‘SSMB29’ వర్కింగ్ టైటిల్తో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడారు. వివాహం తర్వాత హాలీవుడ్లో స్థిరపడిన ప్రియాంక తాను ఇండియన్ సినిమాలను మిస్ అవుతున్నట్లు చెప్పారు. తాను ప్రస్తుతం ఓ భారతీయ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పిన ఆమె.. ఆ ప్రాజెక్ట్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
)
ఇండియన్ సినిమాకు కమ్బ్యాక్ మాత్రమే కాదు..
‘‘నేను ఇండియాను, హిందీ సినిమాలను మిస్ అవుతున్నాను. ఈ సంవత్సరం ఓ భారతీయ సినిమాలో నటిస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇండియన్ ఆడియన్స్ నాపై చూపే ప్రేమ ఎంతో విలువైంది. అది ఎల్లప్పుడూ ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఈ మూవీ ఇండియన్ సినిమాకు కేవలం కమ్బ్యాక్ కాదని, ఇంటికి తిరిగి వెళ్తున్న ఫీలింగ్ ఉంది’’ అని అన్నారు. అయితే ప్రియాంక ఏ సినిమా గురించో మాత్రం చెప్పలేదు. అయితే ఆమె ‘ఎస్ఎస్ఎంబీ29’ గురించే మాట్లాడిందని అభిమానులు పేర్కొంటున్నారు. త్వరలోనే ఆమె ఈ మూవీ సెట్స్ అడుగుపెట్టనున్నట్లు చర్చించుకుంటున్నారు.
Exclusive : #SSMB29 Is Not Just A Comeback It’s Homecoming ❤️🔥❤️🔥🙌🙌🔥🔥🔥💥💥💥🥳🥳
:– #PriyankaChopra#MaheshBabu 🦁 #SSRajamouli
— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) July 4, 2025
ఏడు ఆఫ్రికన్ దేశాల్లో షూటింగ్!
ప్రస్తుతం SSMB29 షూటింగ్ జరుగుతోంది. అటవీ నేపథ్యంలో సాగే కథతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు రాజమౌళి. ఇందులో మహేశ్ మునుపెన్నడూ చేయని ఓ విభిన్నమైన పాత్రలో.. సరికొత్త లుక్తో అలరించనున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న మూవీ.. భారీ ఖర్చుతో కాశీ నగరానికి సంబంధించిన ఓ ప్రత్యేక సెట్లో కొద్దిరోజులుగా షూటింగ్ జరుగుతున్న సమాచారం. మహేశ్ బాబు, పృధ్వీరాజ్ సుకుమారన్ సహా మెయిన్ క్యారెక్టర్లపై కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆఫ్రికా ఖండంలో మొత్తంగా ఏడు దేశాల్లో షూటింగ్ ఉంటుందని సమాచారం.






