
దేశీయ స్టాక్ మార్కెట్(Stock Markets) సూచీలు ఇవాళ (మే 2) లాభాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు ఆరంభంలో భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. అయితే ఇంట్రాడేలో ఆ లాభాలను కోల్పోయాయి. ముఖ్యంగా మెటల్, ఫార్మా షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. Sensex ఓ మోస్తరు లాభాల్లో ముగియగా.. Nifty 24,300 ఎగువన ఫ్లాట్గా స్థిరపడింది. సెన్సెక్స్ ఉదయం 80,300.19 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,242.24) లాభాల్లో ప్రారంభమైంది.
ఇంట్రాడే(Intraday)లో దాదాపు 900 పాయింట్లకు పైగా లాభపడి 81,177.93 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 259.75 పాయింట్ల లాభంతో 80,501.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 12.50 పాయింట్ల లాభంతో 24,346.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.50గా ఉంది. అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, SBI, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి. నెస్లే ఇండియా, NTPC, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, Titan షేర్లు నష్టాలు చవిచూశాయి.