Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఈ రోజు (జులై 10) ఉదయం భూకంప ప్రకంపనలు(Earthquake tremors) సంభవించాయి. రిక్టర్ స్కేల్‌(Richter scale)పై ఈ భూకంపం తీవ్రత 4.4గా నమోదైంది. ఢిల్లీ-NCRతో పాటు హరియాణా, ఉత్తర ప్రదేశ్‌(UP)లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
భూకంప కేంద్రం హరియాణాలోని రోహ్‌తక్‌(Rohtak) సమీపంలో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) తెలిపింది. గురువారం ఉదయం 9:30 గంటల సమయంలో ఈ ప్రకంపనలు కొన్ని సెకన్లపాటు కొనసాగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.

Delhi Earthquake: Tremors Felt In Delhi, NCR, Gurgaon And Its Neighbouring Areas

గతంలో కూడా స్వల్ప భూకంపాలు

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదు. అయితే, ఢిల్లీ జోన్ IVలో ఉన్న భూకంప ప్రమాద ప్రాంతంగా గుర్తించారు. ఇక్కడ గతంలో కూడా స్వల్ప భూకంపాలు నమోదయ్యాయి. కాగా ఢిల్లీ, NCR ప్రాంతాలు హిమాలయ టెక్టానిక్ ప్లేట్ల(Tectonic plates) సమీపంలో ఉండటం వల్ల తరచూ స్వల్ప భూకంపాలకు గురవుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతంలో భౌగోళిక ఒత్తిళ్లు(Geological pressures) భూకంపాలకు కారణమవుతున్నాయి. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, భూకంప సమయంలో భద్రతా చర్యలు పాటించాలని అధికారులు సూచించారు.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎడతెగని ‘ముసురు’.. వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులు

తెలుగు రాష్ట్రాల్లో ముసురు వానల(Rains)తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. మరోవైపు సూర్యరశ్మి లేకపోవడంతో సీజనల్ వ్యాధులు(Seasonal diseases) ప్రబలుతున్నాయి. దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. దీంతో జలుబు, జ్వరం, దగ్గుతో…

Heavy Rains: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. మరో రెండ్రోజులు అలర్ట్

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఈ ద్రోణి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు తీరాల సమీపంలో నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *