SRH vs CSK: చెపాక్‌లో సన్‘రైజ్’.. ఆరెంజ్ ఆర్మీ ప్లేఆఫ్స్ అవకాశాలు పదిలం!

సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) సాధించింది.. అద్భుత ఆటతో చెపాక్‌లో చెన్నై(CSK)ని చిత్తు చేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో సత్తా చాటింది. శుక్రవారం జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. దీంతో ప్లేఆఫ్స్(Playoffs) అవకాశాలను కాస్త మెరుగుపర్చుకుంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి ఆకట్టుకుంది. చెపాక్‌లో గత 5 మ్యాచుల్లో ఓడిన రైజర్స్ నిన్నటి మ్యాచ్‌ ద్వారా తొలి విజయం సాధించినట్లైంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో CSK ఓటముల పరంపర కొనసాగిస్తోంది. ఆఖరికి హోంగ్రౌండ్ అయిన చెపాక్‌లోనూ ఆ జట్టుకు అదృష్టం కలిసిరావట్లేదు. IPL హిస్టరీలో తొలిసారి ఆ జట్టు వరుసగా నాలుగు హోం మ్యాచ్‌లలో ఓడింది. దీంతో ఈ సారి ప్లేఆఫ్స్ అవకాశాలు ఏమైనా మిరాకిల్ జరిగితే తప్పా.. దాదాపు మూసుకుపోయినట్లే.

హర్షల్ దెబ్బకు.. చెన్నై బ్యాటర్లు విలవిల

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న SRH, చెన్నై సూపర్ కింగ్స్‌ను కట్టడి చేయడంలో పూర్తిగా సఫలమైంది. చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్ అయింది. ఆయుశ్ మాత్రే 30, జడేజా 21, బ్రెవిస్ 42, దూబే 12, హుడా 22 పరుగులు సాధించారు. కెప్టెన్ ధోనీ (6) నిరాశపర్చాడు.SRH బౌలర్లలో హర్షల్ పటేల్ (4/28) అద్భుత ప్రదర్శనతో చెన్నై పతనంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి కమిన్స్ 2, ఉనద్కత్ 2, షమీ 1, మెండిస్ 1 వికెట్లు తీసి సహకారం అందించారు.

ఇషాన్.. మెండిస్ బాధ్యతాయుత ఇన్నింగ్స్

అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఇషాన్ కిషన్ (44 పరుగులు, 34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ట్రావిస్ హెడ్ (19) పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత క్లాసెన్ (7), అనికేత్ వర్మ (19) త్వరగా ఔటైనా, చివర్లో కమిందు మెండిస్ (32*) నితీష్ కుమార్ రెడ్డి (19*) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి, మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *