Odela-2: ఓటీటీలోకి వచ్చేసిన ఓదెల-2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) తాజాగా నటించిన చిత్రం ఓదెల-2 (Odela 2). తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్‌లో బాక్సాఫీస్ ముందుకొచ్చిన ఈ చిత్రం ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)’లో గురువారం (మే 8) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్‌గా దర్శకుడు అశోక్ తేజ(Director Ashok Teja) ఈ మూవీని తెరకెక్కించారు. సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందించారు.

నాగసాధువుగా తమన్నా..

ఈ సినిమాలో తమన్నా శివశక్తి పాత్రలో నాగసాధువుగా కనిపించింది. ఈ చిత్రాన్ని సంపత్ నంది(Sampath Nandi) టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందించారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ (Hebah Patel), యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు.

కథ ఏంటంటే..

ఓదెల(Odela) అనే గ్రామంలో జరిగే కథ ఇది. గ్రామంలో భార్య రాథ (Hebba Patel) చేతిలో హత్యకు గురైన తిరుపతి (Vasishtha N. Simha) ఆత్మ, ప్రేతాత్మగా మారి ఊరి ప్రజలపై పగ తీర్చుకోవడం మొదలు పెడుతుంది. గ్రామంలో తిరుపతి ప్రేతాత్మ నవ వధువులను అత్యాచారం చేసి చంపేస్తుంది. దీంతో తిరుపతి భయంకర దుష్టశక్తిగా మారాడని ఓదెల గ్రామస్తులకు తెలుస్తుంది. తిరుపతి ప్రేతాత్మ ఓదెలలో ఇంకెన్ని ప్రాణాలు బలి తీసుకుంది? ఓదెలను కాపాడటానికి వచ్చిన నాగ సాధువు బైరవి (Tamannaah)కి, తిరుపతి ప్రేతాత్మకు మధ్య ఎలాంటి పోరు నడుస్తుంది అనేది ఈ సినిమా కథ.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *