Telangana Assembly: మన్మోహన్‌ సింగ్‌కు ‘భారత రత్న’ ఇవ్వాలి: అసెంబ్లీ తీర్మానం

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) మృతి దేశానికి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభ ప్రారంభం కాగానే సభ్యులంతా జాతీయగీతం ఆలపించారు. అనంతరం మన్మోహన్ సింగ్ మృతిపై సంతాప తీర్మానాన్ని(Resolution of condolence) సీఎం సభలో ప్రవేశపెట్టారు. మన్మోహన్‌ సింగ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపుతున్నట్లు ప్రకటించారు. దేశ ప్రధానిగా మనోహ్మన్ చేసిన సేవలు మరువలేనిమన్నారు. అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన ఆయన భారతదేశానికి విశిష్ట సేవలు అందించారని సీఎం కొనియాడారు.

ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేశారు: సీఎం

PMగా, ఆర్థిక సలహాదారుగా, RBI గవర్నర్‌గా అనేక సంస్కరణలను అమలు చేశారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థ(Economic system)ను సుస్థిరం చేశారని అన్నారు. కూలీలకు ఉపాధి అందించే ఉపాధి హామీ పథకానికి రూపకర్త అని కొనియాడారు. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్‌ సింగ్‌ను దేశం గుర్తుంచుకుంటుందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పీఎంగా మన్మోహన్ చూపిన చొరవ అమోఘమని అన్నారు. దేశానికి విశిష్ట సేవలు ఏర్పాటు చేసిన ఆయనకు ‘భారత రత్న’ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే తెలంగాణలోనూ ఆయన స్మారక స్తూపం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.

బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు: కేటీఆర్

మనోహ్మన్ ప్రధాని పేరు చెబితేనే దేశంలో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు గుర్తుకు వస్తాయని, దేశానికి ఆయన అందించిన సేవల వల్లే భారతరత్నకు అర్హుడని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇక మన్మోహన్ సింగ్‌ సంతాప తీర్మానాకికి BRS సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ నేత KTR ప్రకటించారు. అలాగే ఆయనకు భారత రత్న ఇవ్వాలన్న సీఎం రేవంత్ ప్రతిపాదనకు కూడా మద్దతిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. అనవసరపు ఆర్భాటాలు లేకుండా, సింపుల్‌గా తన పని చేసిన మహానుభావుడు మన్మోహన్ సింగ్ అని కేటీఆర్ కొనియాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *