KTR: కొత్త రేషన్ కార్డులపై KTR సంచలన ప్రకటన!

మన ఈనాడు: మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం.. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Telangana Elections 2023: తెలంగాణలో ప్రచారం చేసుకునేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అనేక రకాలుగా ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ (KTR) బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను (BRS Manifesto) ప్రజలకు అర్ధం అయ్యే విధంగా ప్రచారం చేస్తున్నారు.
2014లో రూ.400 ఉన్న సిలిండర్‌ మోదీ (Modi) హయాంలో ప్రస్తుతం రూ.1200 అయ్యిందని అన్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder) ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో కరెంట్ కష్టాలు ఉండేవని తెలిపారు. కేసీఆర్ పాలనలో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వ్యాఖ్యానించారు.

మంత్రి కేటీఆర్ రేషన్ కార్డులపై (Ration Cards) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనవరి నుంచి కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని వెల్లడించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

IBPS PO 2025 Notification: డిగ్రీ అర్హతతో IBPSలో భారీ నోటిఫికేషన్.. 5,208 పోస్టులు భర్తీ! ఇలా అప్లై చేయండి!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా రెండు కీలక నోటిఫికేషన్ల( Notifications)ను విడుదల చేశాయి. బ్యాంకింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. IBPS PO/MT…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *