మన ఈనాడు:
జనంతో ఉంటూ..ఆపదలో అండగా నిలబడిన నాయకుడికే వైపే ప్రజలు మొగ్గు చూపుతారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా..ప్రజలకు అందుబాటులో ఉండటంలో వెనకడుగు వేయలేదు..అందుకే అభివృద్ధి మంత్రం జపిస్తున్న కారుకు ఆ నేతను చూసి ఫీవర్ పట్టుకుంది. దేవరకొండ నియోజకవర్గంలో ‘హస్తం’ అభ్యర్థి బాలు నాయక్ గెలుపించుకునేందుకు ప్రజలే సిద్దం అయ్యారు.
తెలంగాణ సెంటిమెంట్ అధికారం పగ్గాలు చేపట్టిన గులాబీ ఎమ్మెల్యే రవీంద్రనాయక్పై సొంతపార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారు. సంక్షేమ పథకాలు జపంతో నియోజకవర్గంలో ప్రచారం చేస్తుంటే ప్రజలే వెనక్కి పంపిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న దేవరకొండలో చింతపల్లి, చందంపేట, గుండ్లపల్లి, పెద్ద అడిసెర్లపల్లి, నెరేడుగొమ్ము,కొండమల్లేపల్లి, దేవరకొండ మండలాల్లో హస్తం పార్టీ బలంతోపాటు బాలునాయక్ ఉన్న వ్యక్తిగత సంబంధాలు నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా ఓటు కాంగ్రెస్ బదిలీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రేవంత్రెడ్డితోపాటు కొమటిరెడ్డి సోదరులు బలంతో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ జోష్లో ఉంది. కార్యకర్తలు స్వచ్చంధంగా వచ్చి కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులు గెలుపుకోసం తమదైన శైలిలో పనిచేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే రాహుల్ ప్రకటించిన ఆరు గ్యారంటీల బలం..ప్రజల సంక్షేమం అనే నినాదంతో ప్రజలకు భరోసాను సైతం నింపుతున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్..ప్రజలకు అందేది సుపరిపాలన అంటున్నారు. నవంబర్ 30న ప్రజలు పెద్ద ఎత్తున పొలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తిరుగులేని తీర్పు ఇవ్వబోతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల్లో జగన్పై నమ్మకం పోయింది.. అందుకే విజయసాయి రాజీనామా: Sharmila
YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) ఇవాళ తన పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా(Resignation) సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాపై APCC నేత వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. మాజీ సీఎం, YCP…