Etela Rajender : సీఎం ఫామ్‌హౌస్‌కి వస్తున్నారంటే…

మన ఈనాడు:

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో 15 సంవత్సరాలు ఉన్నానని.. తాను పరాయి వాడిని కాదని.. ఈ నియోజకవర్గ బిడ్డనేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. గజ్వేల్ ప్రజలకు ఏ అవసరమైనా వస్తే ఎప్పుడైనా కలిశారా? అని ప్రశ్నించారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో 15 సంవత్సరాలు ఉన్నానని.. తాను పరాయి వాడిని కాదని.. ఈ నియోజకవర్గ బిడ్డనేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. గజ్వేల్ ప్రజలకు ఏ అవసరమైనా వస్తే ఎప్పుడైనా కలిశారా? అని ప్రశ్నించారు. ఫామ్ హౌస్‌లో ముఖ్యమంత్రి ఉంటే చుట్టూ ప్రక్కల గ్రామాలు తీవ్ర ఇబ్బందికి గురయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కి వస్తున్నారంటే రోడ్డు పక్కన కంకులు, జామకాయలు అమ్ముకునే వారికి కూడా ఇబ్బందేనని ఈటల పేర్కొన్నారు.

ఈ రోజు తాను నామినేషన్‌కి వస్తున్నానని ప్రజలు తన ర్యాలీలకు రాకుండా ఆపడానికి కోట్ల రూపాయలతో ప్రజలను అడ్డుకోవాలని చూశారని ఈటల పేర్కొన్నారు. ఈ ఎన్నిక కేసీఆర్ అహంకారానికి.. మన ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతోందన్నారు. గజ్వేల్‌లో ఇళ్లు లేని వారందరికీ డబుల్ బెడ్ రూంలు కట్టిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే ఒకరికే పెన్షన్ వస్తుందని.. అదే బీజేపీ అధికారంలో ఉంటే ఇద్దరికీ వస్తుందని ఈటల రాజేందర్ వెల్లడించారు.

 

Related Posts

కటింగ్‌లు, కటాఫ్‌లు తప్ప.. రేవంత్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేంటి? 

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఏడాది పాల‌న‌పై ఎక్స్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను రేవంత్ సర్కార్ న‌ట్టేట ముంచిందని మండిపడ్డారు.  సంక్షేమ ప‌థ‌కాల‌కు కోత‌లు, క‌టాఫ్‌లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వ‌దిలేశార‌ని…

డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్.. చంద్రబాబుకు విజ్ఞప్తి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప ఎయిర్ పోర్టులో జిల్లా నేతలు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కడప నుంచి హెలికాప్టర్ లో చంద్రబాబు మైదుకూరు చేరుకున్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి (NTR…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *