
తెలంగాణ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) (TG TET) రిజల్ట్స్ వచ్చేశాయి. సచివాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు జరిగాయి. మొత్తం 1,37,429 మంది పరీక్షలు రాశారు. పేపర్–1కు మొత్తంగా 63,261 మందికి గానూ 47,224 (74.65%), పేపర్– 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో 66,686 మందికి 48,998 మంది (73.48%), సోషల్ స్టడీస్లో 53,706 మందికి గానూ 41,207 మంది (76.73%) హాజరయ్యారు. మొత్తం 1,37,429 మందికి గాను 30,649 మంది అర్హత సాధించారు. రిజల్ట్స్ను https://schooledu.telangana.gov.in లేదా https://tgtet.aptonline.in ద్వారా చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.