Flash: MLA కారు బోల్తా.. వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు

మన ఈనాడు:తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఎమ్మెల్యే కారు ఢీకొట్టడంతో బోల్తా పడిన ఘటన జరిగింది. ఆ సమయంలో శాసనసభ్యుడు(MLA) హైదరాబాద్ నుంచి ధర్మపురి వైపు వెళ్తున్నారు.

యెండపల్లి మండలం అంబారిపేట సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ గాయపడ్డారు.

లక్ష్మణ్ కుమార్‌కు తల, కాళ్లు, చేతులపై గాయాలు కాగా, అతని ఇద్దరు గన్‌మెన్‌లకు కూడా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ ఉమాసాగర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యేతో పాటు గాయపడిన వారిని కరీంనగర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

Related Posts

RGకర్ డాక్టర్ కేసు.. దోషిగా సంజయ్‌ రాయ్‌.. రేపే శిక్ష ఖరారు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్​జీ కర్ ఆస్పత్రి (RG Kar Hospital) ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం కేసులో కోల్‌కతాలోని సీల్దా కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి జనవరి…

IMD Report: దేశంలో ప్రకృతి ప్రకోపం.. గత ఏడాది 3200 మంది మృతి

భారత్‌(India)లో ప్రకృతి వైపరీత్యాలు(Natural Calamities) ఈ మధ్య తీవ్రంగా ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా దేశంలో ప్రకృతి వైపరీత్యాల ద్వారా 3200 మంది మరణించారని భారత వాతావరణ వార్షిక నివేదిక(Indian Meteorological Annual Report-2024) పేర్కొంది. ఇందులో అత్యధికంగా పిడుగుల ద్వారా 1374…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *