యువరాణి పాత్రల్లో మెప్పించిన తెలుగు సినీ తారలు

తెలుగు సినిమాల్లో రాజుల కాలాన్ని ప్రతిబింబించే పౌరాణిక, చారిత్రక చిత్రాలు ప్రేక్షకులను తరచూ ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటి చిత్రాల్లో కొన్ని ప్రేక్షకుల మనసుల్ని గెలిస్తే , మరికొన్ని నిరాశను మిగిల్చిన సందర్భాలూ ఉన్నాయి. బాహుబలి, పొన్నియిన్ సెల్వన్, ‘మగధీర’ వంటి చిత్రాలు మాత్రం భారీ విజయాన్ని సాధించడమే కాదు, చారిత్రక పాత్రలకు కొత్త ఊపిరినిచ్చాయి. ఈ నేపథ్యంలో యువరాణుల పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) – ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంలో కాజల్ అగర్వాల్ యువరాణి మిత్రవింద పాత్రలో కనిపించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆమెకు తోడు వచ్చిన రాంచరణ్ నటనతో ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.

త్రిష కృష్ణన్(Trisha) – మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 1, 2 చిత్రాల్లో యువరాణి కుందవై పాత్రలో త్రిష కనిపించింది. శత్రువుల కుట్రలను పసిగట్టి, రాజకీయ నైపుణ్యంతో ముందడుగు వేసే పాత్రలో ఆమె అభినయం ప్రశంసలందుకుంది.

అనుష్క శెట్టి(Anushka Shetty) – ‘అరుంధతి’ చిత్రంలో అరుంధతి/జేజమ్మ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అదే తరహాలో ‘బాహుబలి’ సిరీస్‌లో దేవసేనగా, ‘రుద్రమదేవి’లో రుద్రమదేవిగా కత్తులు చేతబట్టి శత్రువులకు ధీటుగా ఎదురైన యువరాణిగా ఆకట్టుకుంది.

హన్సిక మోత్వాని(Hansika) – ‘పులి’ అనే తమిళ చిత్రంలో యువరాణి మంథాగినిగా నటించి అలరించింది. ఈ చిత్రంలో శ్రీదేవి కీలక పాత్రలో కనిపించగా, సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా, హన్సిక పాత్ర ప్రేక్షకులను మెప్పించింది.

ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) – ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో మందాకినీ దేవిగా అలరించారు. ఆమె పాత్ర సినిమాకు ఓ మిస్టిక్ ఆకర్షణను తీసుకువచ్చింది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *