Ration Card: సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి కందిపప్పు, చక్కెర

ManaEnadu:రేషన్ కార్డుదారులకు సర్కార్ తీపి కబురు అందించింది. రేషన్‌ కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు వచ్చేనెల నుంచి సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఇక నుంచి రాయితీపై రూ.67కే కిలో కందిపప్పు అందించనుంది.

Ration Card: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి రేషన్ కార్డు లబ్దిదారులకు ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. బయట మార్కెట్ లో నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఆగస్టు నుంచి అక్టోబరు వరకు 3 నెలలకు సరిపోయేలా కందిపప్పు, పంచదార, గోధుమపిండి సరఫరా కోసం సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్టర్ల నుంచి ఇప్పటికే టెండర్లకు ఆహ్వానించింది. మూడు నేలలకు సరిపోయే విధంగా 22,500 టన్నుల కందిపప్పు, 17,538 టన్నుల పంచదార సేకరణ కోసం టెండర్లకు పిలిచింది. వచ్చేనెల నుంచి రేషన్ కార్డు ఉన్నవారికి రాయితీపై రూ.67కే కిలో కందిపప్పు అందించనుంది బాబు సర్కార్. అలాగే అరకిలో చొప్పున చక్కెరను కూడా పంపిణీ చేయనుంది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *