Jr.NTRతో యాక్షన్ థ్రిల్లర్.. అసలు నిజం ఇదే!

Mana Enadu: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో ఫేమ్ ఉన్న యాక్టర్. సినిమా ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా అందులో చక్కగా ఒదిగిపోతాడు. వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన కష్టంతో ఓ స్టార్‌గా ఎదిగాడు. నటన, డాన్స్, యాక్షన్ ఇలా ఏ కేటగిరీ అయినా.. నవరసాలు పండించడం తారక్‌కు వెన్నెతో పెట్టిన విద్య.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం వరుస మూవీలతో బిజీబిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో ‘దేవర’ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా క్లైమాక్స్‌కు చేరకుంది. మరోవైపు దీనిని రెండు పార్టులుగా తీస్తానని ఇప్పటికే ప్రకటించేశాడు డైరెక్టర్ కొరటాల. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్‌ రోల్‌లో నటిస్తున్నాడు. దీంతోపాటు హిందీలో ‘వార్ 2’ సినిమాను కూడా మొదలుపెట్టాడు తారక్. ఈ హిందీ చిత్రంలో హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. ఈ మూవీ భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ‘వార్ 2’ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమాలో నటించనున్నాడు.

తాజాగా మరో భారీ మూవీకి ఈ నందమూరి వారసుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది చివర్లో వచ్చిన ‘హాయ్ నాన్న’ సినిమా డైరెక్టర్ శౌర్యువ్‌ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయనున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇప్పటికే డైరెక్టర్ ఎన్టీఆర్‌కు స్టోరీని కూడా వినిపించాడట. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా తొలి భాగం 2026లో మొదలై.. 2028లో విడుదల కానుంది. రెండో భాగం 2030లో విడుదలకు డైరెక్టర్ ప్లాన్‌ చేసినట్లు రూమర్స్‌ వచ్చాయి. తాజాగా దర్శకుడు శౌర్యువ్ ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్‌తో తాను సినిమా తీయనున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పేశాడు డైరెక్టర్‌ శౌర్యువ్‌.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *