గుడ్ న్యూస్.. ఆగస్టు 6 నుంచి అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ సేల్‌..  వీటిపై భారీ డిస్కౌంట్స్

Mana Enadu: మీరు ఆన్ లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తుంటారా.. అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరో సేల్‌కు రెడీ అయింది. సాధారణంగా అమెజాన్ దాదాపుగా ప్రతి నెలకు ఓ సేల్ పెడుతుంది. ముఖ్యంగా పండుగలు, ఇతర స్పెషల్ ఈవెంట్స్ ఉన్న రోజుల్లో తప్పకుండా సేల్ అనౌన్స్ చేస్తుంటుంది. ఈ సేల్ లో తక్కువ ధరలకే ఉత్పత్తులను విక్రయిస్తుంది. అందుకే కస్టమర్స్ అమెజాన్ సేల్ అనగానే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో స్పెషల్ సేల్ అమెజాన్ మళ్లీ ముందుకువచ్చింది. ఇటీవలే ప్రైమ్‌ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్‌ డే సేల్‌ నిర్వహించిన ఈ కంపెనీ.. ఇప్పుడు అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌ (Amazon Great Freedom Festival Sale) తో కస్టమర్లను ఆకర్షించేందుకు రెడీ అయింది. మరి ఈ సేల్  ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది..? ఇందులో ఏయే ఉత్పత్తులకు డిస్కౌంట్స్ ఉంటాయో తెలుసుకుందామా..?

అమెజాన్ సేల్ ఎప్పటి నుంచి అంటే..?

అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌ ఆగస్టు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరగనుంది. ప్రైమ్‌ కస్టమర్లకు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి, సాధారణ కస్టమర్లకు మధ్యాహ్నం నుంచి ఈ సేల్‌ అందుబాటులోకి వస్తుందని ఈ కంపెనీ పేర్కొంది. 

డిస్కౌంట్ల వివరాలు ఇవే..?

ఈ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు.  మొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇతర గృహోపకరణాలు, అలెక్సా డివైజులపై డిస్కౌంట్లు ఉండనున్నాయి.  ఇప్పటికే దీనికి సంబంధించి వెబ్‌సైట్‌లో బ్యానర్‌ను సిద్ధం చేసింది. మొబైల్స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 80 శాతం, ఫ్యాషన్‌ ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్‌ అందించనున్నట్లు  అమెజాన్‌ పేర్కొంది. స్మార్ట్‌టీవీలు, ప్రొజెక్టర్లు, వాషింగ్‌ మెషీన్లు, ఫ్రిజ్‌లపైనా డిస్కౌంట్లు ఉంటాయని వెల్లడించింది. ఉత్పత్తుల వారీగా ఆఫర్ల వివరాలు త్వరలో రివీల్‌ చేయనున్నట్లు అమెజాన్ తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం ఈ సేల్ లో మీకు కావాల్సినవి తక్కువ ధరకే కొనేయండి మరి.

 

 

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *