Assam : ‘ఆంటీ అత్యాచారం అంటే ఏమిటి?’ .. అడిగిన రెండు రోజులకే బాలికపై గ్యాంగ్ రేప్

ManaEnadu:అస్సాంలోని ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న పదేళ్ల బాలికపై ముగ్గురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గురించి తెలిసిందే. ఈ ఘటన దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఓ హృదయ విదారక విషయం తెలిసింది. ఈ దారుణం చోటుచేసుకునే రెండ్రోజుల ముందే బాధితురాలు.. కోల్​కతా హత్యాచార ఘటన గురించి పేపర్​లో చదివిందట. ఈ క్రమంలో అత్యాచారం అంటే ఏంటని తన బంధువును అడిగిందట. అలా అడిగిన రెండ్రోజులకే ఆ బాలిక గ్యాంగ్ రేప్​కు గురి కావడం ఇప్పుడు అందరి హృదయాలను కలచి వేస్తోంది.

అస్సాంలోని నాగావ్‌ జిల్లాకు చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక ట్యూషన్‌ అనంతరం సైకిల్‌పై ఇంటికి బయల్దేరగా దారిలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. ఆ తర్వాత సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయాలపాలై, అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను స్థానికులు గమనించారు. ప్రాణాలతో బయటపడిన బాధితురాలిని పోలీసుల సాయంతో ఆస్పత్రిలో చేర్పించగా ప్రస్తుతం ఆ బాలిక చికిత్స పొందుతోంది.

ఈ ఘటన గురించి బాలిక బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఓ హృదయవిదారక విషయాన్ని షేర్ చేసుకున్నారు. “బాలిక తండ్రి గువాహటిలో ఉంటారు. ఆయనకు తన కుమార్తెను చదివించే స్థోమత లేక నా వద్దకు పంపారు. పశ్చిమ బెంగాల్‌ ఘటన గురించి పేపర్‌లో చదివి.. ‘ఆంటీ రేప్‌ అంటే ఏమిటి..?’ అని నన్ను అడిగింది. కానీ తనకే ఇలా జరుగుతుందని అనుకోలేదు. తనను కాపాడటంలో నేను ఫెయిల్ అయ్యానని బాధగా ఉంది. ఆమె డీఎస్పీ కావాలని కలగంది. ఆమెను కలిసేందుకు ఆసుపత్రికి డీఎస్పీ వస్తే అంత కష్టంలోనూ చిరునవ్వు నవ్వింది.’’ అని ఆమె బంధువు తెలిపారు.

మరోవైపు ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా అతణ్ని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ జరిగిన ఘటనపై ఆరా తీస్తుండగా నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో చెరువులోకి దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. అతణ్ని ప్రాణాలతో బయటకు తీసేందుకు ప్రయత్నించినా అప్పటికే మరణించాడని పోలీసులు తెలిపారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *