ఇక నుంచి యూపీఐ చెల్లింపులకు బయోమెట్రిక్‌ లేదా ఫేస్‌ ఐడీ తప్పనిసరి.. ఎందుకంటే..?

Mana Enadu:యూపీఐ.. ఇప్పుడు యావత్ భారత్ లో రూపాయి ట్రాన్సాక్షన్ నుంచి లక్షల వరకు ఈ పద్ధతిలోనే లావాదేవీలు జరుగుతున్నాయి. పాన్ షాప్ లో చెల్లించే ఐదు రూపాయలు.. టీ షాపులో 10 రూపాయలు.. కూరగాయలు.. ట్యాబ్లెట్లు.. బట్టలు.. మొబైల్ ఫోన్లు.. ఇలా రూపాయి నుంచి వేలాది రూపాయల లావాదేవీలు క్షణాల్లో యూపీఐతో చెల్లించొచ్చు. జస్ట్ 4 అంకెల పిన్ ఎంటర్ చేస్తే చాలు క్షణాల్లో ట్రాన్స్ ఫర్ అయిపోతుంది. అయితే ఈ డిజిటల్ పేమెంట్ పద్ధతిని మరింత సురక్షితంగా మార్చేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) చర్యలు చేపట్టేందుకు రెడీ అయింది.

ఇన్నాళ్లూ యూపీఐ చెల్లింపులకు కేవలం 4 అంకెల పిన్ లేదా.. ఫింగర్ ప్రింట్ మాత్రమే ఉండేది. ఇకపై నుంచి  స్మార్ట్‌ ఫోన్లలో బయోమెట్రిక్‌ లేదా ఫేస్‌ ఐడీని ఉపయోగించాల్సి రావొచ్చు. ఇకపై యూపీఐ చెల్లింపుల కోసం ఫోన్లలో ఉండే ఈ బయోమెట్రిక్‌ ఫీచర్లను తప్పనిసరి వినియోగించుకోవాలని ఎన్‌పీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే గూగుల్‌ పే, ఫోన్‌ పే, అమెజాన్‌ పే, పేటీఎం సహా ఇతర యాప్‌లతో చర్చలు జరుపుతున్నా..   పిన్‌ లేదా బయోమెట్రిక్‌ను ఆయా కంపెనీలు ఆప్షనల్‌గా ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.  సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా ఎన్పీసీఐ తాజాగా ఈ మార్పులు చేయనున్నట్లు తెలిపింది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *