తాళం వేసిన ఇళ్లే టార్గెట్..అద్దె కారులో దోచుకెళ్తారు

జల్సాలకు అలవాటుపడి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి దాదాపు 36 తులాల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలతో పాటు ల్యాప్‌టాప్, కారు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ముఠా (దోపిడీ గ్యాంగ్) చోరీలకు పాల్పడినట్లు ఏసీపీ రాములు వివరించారు.

నేరేడ్‌మెట్ ప్రాంతానికి చెందిన బండ విజయకుమార్ (28) ఇంటీరియర్ వర్క్‌తో పాటు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. కుషాయిగూడ ప్రాంతంలో నివసించే కృష్ణవంశీ(26) ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అల్వాల్ ప్రాంతానికి చెందిన మరో నిందితుడు సతీష్ (30) కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రధాన నిందితుడు విజయకుమార్, కృష్ణవంశీ, సతీష్‌లు నాలుగు నెలల క్రితం పరిచయమయ్యారు.

గతంలో అమెజాన్‌లో పనిచేసిన కృష్ణవంశీ అనే ఇంటీరియరిస్ట్ వివిధ ప్రాంతాలకు చెందిన కాలనీపై పూర్తి పట్టు ఉండడంతో పథకం ప్రకారం దొంగతనాలు చేసేవాడు. దొంగతనం చేయాలనుకున్న ఇంటి నుంచి కారును అద్దెకు తీసుకుని దూరంగా ఉంచి… ముందుగా రెక్కీ ప్రకారం తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని మరో ఇద్దరు డోర్ కట్టర్ తో తాళాలు తెరిచి చోరీలకు పాల్పడ్డారు.

సుమారు 32 తులాల బంగారు ఆభరణాలు, 4 కిలోల వెండి ఆభరణాలు, కారుతోపాటు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరి ముఠాలోని మరో ఇద్దరు నిందితులు తేజ, సుధాకర్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాహుల్ దేవ్ ఆధ్వర్యంలో డీసీపీ నరసింహ ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ కుమార్ కేసు దర్యాప్తు చేపట్టారు.

Related Posts

Israel-Hamas War: గాజా స్ట్రిప్‌‌పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్.. 80 మంది మృతి!

గాజా స్ట్రిప్‌(Gaza Strip)పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 80 మంది పాలస్తీనియన్లు (Palestinians) ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది గాయపడ్డారని పాలస్తీనా వైద్య వర్గాలు(Palestinian medical communities) వెల్లడించాయి. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌…

Operation Karregutta: కర్రెగుట్ట ఆపరేషన్‌లో 31 మంది మావోలు మృతి

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు(Telangana-Chhattisgarh border) బీజాపూర్ జిల్లా ఉసురు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కర్రెగుట్ట(Karregutta) కేంద్రంగా జరిగిన ఆపరేషన్‌లో 31మంది మావోయిస్టులు(Maoists) మృతి చెందినట్లు సీఆర్పిఎఫ్ డీజీ జీపీ సింగ్(CRPF DG GP Singh), ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ అరుణ్‌దేవ్‌ గౌతం(DGP Arundev Gautam) తెలిపారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *