ఓ యువతి ఓ టీవీ యాంకర్పై మనసుపడింది. ఆయనతో చాట్ చేసింది. ఆతడినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. అయితే అందుకు ఆ వ్యక్తి ఒప్పుకోకపోవడంతో ఏకంగా కిడ్నాప్ చేయించింది. సినిమా ట్విస్టులా ఉన్న ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్లో జరిగింది. ఈ కేసులో తృష్ణ అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓ టీవీ ఛానల్లో పనిచేస్తున్న ప్రణవ్ను కిడ్నాప్ చేయించిన తృష్ణ అనే యువతిని ఉప్పల్ పొలీసులు అరెస్టు చేశారు. ప్రణవ్ను పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్నకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. భారత్ మాట్రిమోనిలో ప్రణవ్ ఫొటోతో చైతన్య రెడ్డి అనే యువకుడు చాటింగ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ప్రణవ్ భారత్ మాట్రిమోనిలో పరిచయమై తనతో చాటింగ్ చేస్తున్నట్లు భ్రమపడిన తృష్ణ అనే యువతి, తనకు ముఖం చాటేశాడని అనుమానంతో ఈ నెల 10న అర్ధరాత్రి సమయంలో అయిదుగురి వ్యక్తులతో అతణ్ని కిడ్నాప్ చేయించింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని ప్రణవ్ను ఒత్తిడి చేసింది. ఈ నెల 11న ఉదయం గంటలకు కిడ్నాపర్ తృష్ణ నుంచి తప్పించుకున్న ప్రణవ్ పోలీసులను ఆశ్రయించి, ఆమెపై ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆమెపై ఉప్పల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితురాలు తృష్ణ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.