ప్రభాస్ రూ.2 కోట్లు.. అల్లు అర్జున్ రూ.కోటి.. వరద బాధితులకు పాన్ ఇండియా స్టార్ల విరాళం

ManaEnadu:తెలుగు రాష్ట్రాల్లో వరదలు (Telugu State Floods సృష్టించిన విలయం గురించి తెలిసిందే. ఈ విలయంతో లక్షల మంది భారీగా నష్టపోయారు. ఇప్పటికీ పలు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. వరద తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లలోకి బురద చేరి ఏ వస్తువూ పనికి రాకుండా పోయింది. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సర్వం కోల్పోయి వరద బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తమ కలలన్నీ బురదగా మారడం చూసి కన్నీరు పెడుతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు అండగా టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood Flood Donations) ప్రముఖులు ముందుకొస్తున్నారు.

వరద బాధితులకు సాయం చేసేందుకు తాజాగా పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ (Prabhas Flood Donation) ముందుకొచ్చాడు. సాధారణంగా కష్టాల్లో ఉన్నవారికి చేయూతనందించడంలో ఎప్పుడూ ముందుండే డార్లింగ్ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం విరాళాలు ప్రకటించాడు. తాజాగా ప్రభాస్‌ రూ.2 కోట్లు విరాళంగా అందించనున్నట్లు ఆయన వ్యక్తిగత టీమ్‌ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి ప్రభాస్ (Prabhas Donates Rs. 2 Crores) చెరో రూ.కోటి ప్రకటించాడు. ఇప్పటి వరకు సినీ ప్రముఖులు ప్రకటించిన విరాళాల్లో ప్రభాస్‌ ప్రకటించిన నగదే అత్యధికం.

మరోవైపు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) కూడా వరద బాధితులకు విరాళం ప్రకటించాడు. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని తాను భగవంతుని ప్రార్థిస్తున్నానని బన్నీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు.

ఇప్పటికే చిరంజీవి రూ.కోటి, బాలకృష్ణ రూ.కోటి, మహేశ్‌బాబు (Mahesh Babu) రూ.కోటి, ఎన్టీఆర్‌ రూ.కోటి, సిద్ధూ జొన్నల గడ్డ రూ.30 లక్షలు, విష్వక్‌సేన్‌ రూ.10 లక్షలు, డైరెక్టర్ వెంకీ అట్లూరి రూ.10 లక్షలు, అనన్య నాగళ్ల రూ.2.5లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కల్కి చిత్రంతో భారీ సక్సెస్ అందుకున్న వైజయంతి మూవీస్‌ ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (ap cm relief fund)కు రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు తెలిపింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *