గోల్డెన్ బాయ్​కి ‘సిల్వర్’ మెడల్.. ఒలింపిక్స్​లో నీరజ్ చోప్రా మరో రికార్డ్

Mana Enadu: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి సిల్వర్ మెడల్ తీసుకొచ్చాడు బల్లెం వీరుడు నీరజ్ చోప్రా. జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో నీరజ్‌ చోప్రా రెండో స్థానంలో నిలిచి దేశానికి రజతం అందించాడు. ఈ ఒలింపిక్స్​లో ఇదే తొలి రజత పతకం కావడం గమనార్హం. మరోవైపు గత ఒలింపిక్స్​లో బంగారు పతకం సాధించిన నీరజ్.. ఈసారి కూడా గోల్డ్​ తీసుకొస్తారని అందరూ భావించారు.. కానీ ఈసారి సిల్వర్ మెడల్​తో వచ్చాడు. అయినా వరుసగా ఒలింపిక్స్​లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఫైనల్‌లో పాకిస్థాన్‌ జావెలిన్‌ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్‌ స్వర్ణం సాధించాడు. అర్షద్ 92 మీటర్ల మార్క్‌ను తాకగా.. నీరజ్‌ 89.45 మీటర్లు విసిరాడు. రజతం సాధించిన తర్వాత నీరజ్ మాట్లాడుతూ.. దేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉందని.. అయితే, తన ప్రదర్శనను ఇంకాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉందని అన్నాడు. పారిస్​లో భారత జాతీయ గీతం వినిపించలేకపోయినందుకు బాధగా ఉందని.. తప్పకుండా భవిష్యత్తులో మరోసారి సాధిస్తాననే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.

ఇద ఈ బల్లెం వీరుడికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. “నీరజ్‌ చోప్రా నువ్వో అద్భతం. నీ ప్రతిభను మళ్లీ నిరూపించావు. మరో ఒలింపిక్‌ మెడల్‌ సాధించి భారత్‌ను గర్వించేలా చేశావు. సిల్వర్​ మెడల్ సాధించిన నీరజ్‌ చోప్రాకు అభినందనలు. భవిష్యత్​లో రాబోయే అథ్లెట్లు తమ కలలను నెరవేర్చు కోవడానికి, అలానే భారత్‌ను గర్వపడేలా చేయడానికి నీరజ్‌ స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుంది” అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.

 

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *