Rain Alert: తెలంగాణలో హెవీ రెయిన్స్.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!

Mana Enadu: తెలంగాణ(Telangana)లో మళ్లీ భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. శనివారం ఖమ్మం, మహబూబాద్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. ఇదిలా ఉండగా మరో నాలుగైదు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD సూచించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, KTDM జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు(Orange Alert) జారీ చేసింది. మరోవైపు ADB, క‌రీంన‌గ‌ర్, పెద్ద‌ప‌ల్లి, ఖ‌మ్మం, WGL, హ‌నుమ‌కొండ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు(Yellow Alert) జారీ అయ్యాయి.

 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: IMD

అలాగే రేపటి నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, పెద్ద‌ప‌ల్లి, క‌రీంన‌గ‌ర్, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. దీంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో మళ్లీ మున్నేరు వాగులో ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. అటు అధికారులు హెచ్చరికలను(Red Alert) జారీ చేశారు. దీంతోపాటు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. WGL, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మున్నేరు(Munneru) పరివాహ ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించారు. దాన్వాయిగూడెం, రమణపేట, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మోతీ నగర్, వెంకటేశ్వర్ నగర్‌లోని మున్నేరు వెంబడి నివసించే ప్రజలను సమీపంలోని రెస్క్యూ సెంటర్‌(Rescue center)కు తరలించారు. అటు తాజా పరిస్థితులపై KMM జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. IMD సూచనల మేరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని కోరారు. దీంతోపాటు వర్షాల నేపథ్యంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1077ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *