Telangana: గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల వివరాల సేకరణపై సీఎం రేవంత్ ఆదేశాలు

ManaEnadu:తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో జారీ చేయనున్న కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి 10 రోజుల పాటు రెండో విడత ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వైద్యారోగ్యశాఖ ప్రాజెక్టులపై సచివాలయంలో మంగళవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రేషన్‌ కార్డులతో పాటు హెల్త్‌ కార్డుల జారీ కోసం అవసరమైన వివరాలు సేకరించేందుకు సెప్టెంబరు 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన (Public Administration) కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని సన్నద్ధం చేయాలని సూచించారు.

 రేషన్‌ కార్డుల (New Ration Cards) జారీకి అర్హతలు, విధివిధానాల కోసం ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. మరో వైపు రాష్ట్ర ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య వివరాలతో హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు (Health Cards in Telangana) ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కార్డులు జారీ చేసేందుకు అవసరమైన వివరాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

ఇందులో భాగంగానే వచ్చే నెలలో ప్రజాపాలన రెండో విడత కార్యక్రమం ప్రారంభిస్తోంది. మరోవైపు డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు మొదటి సారి నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల (Congress Six Guarantees ) కోసం రాష్ట్రవ్యాప్తంగా 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *