Pashamailaram Explosion: రియాకర్ట్ పేలిన ఘటనలో 36 మంది మృతి.. సిగాచీ కంపెనీపై కేసు

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో ఉన్న సిగాచీ రసాయనిక పరిశ్రమ(Sigachi Chemical Industry)లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు(Police Case) నమోదు చేశారు. బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్(Yashwant) ఫిర్యాదు మేరకు పరిశ్రమ యాజమాన్యం సిగాచీపై BDL భానూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో అధికారిక లెక్కల ప్రకారం 36 మంది మృతి చెందగా, మరికొంతమంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటి వరకూ 11 మంది మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.11 లక్షలు, 34 మంది క్షతగాత్రులకు రూ.17 లక్షల నగదును ప్రభుత్వం అందించింది.

Telangana govt slams Sigachi industries management's absence after deadly blast

DNA పరీక్షలు నిర్వహించే గుర్తించారు..

కాగా సిగాచీ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో జరిగిన పేలుడులో 19 మంది కార్మికులు మృతి చెందారని, ఐదుగురి ఆచూకీ తెలియడంలేదని అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. కానీ, సహాయక సిబ్బంది మంగళవారం మరో 17 మృతదేహాలను వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 36కు చేరింది. గాయపడిన 34 మంది నగర శివార్లలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా 60 మంది కార్మికుల ఆచూకీ లభించిందని, మరో 13 మంది ఆచూకీ తెలియడంలేదని అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 143 మంది పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. భవనం శిథిలాలను పూర్తిగా తొలగిస్తేనే గల్లంతైన వారి వివరాలు లభిస్తాయి. మరోవైపు చనిపోయిన వారిని గుర్తించడానికి వారి బంధువులకు DNA పరీక్షలు నిర్వహించి గుర్తించే ప్రక్రియ చేపట్టారు.

ఉన్నతస్థాయి కమిటీ వేయాలి: బీజేపీ

బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(N. Ramachandra Rao)తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పాశమైలారం పారిశ్రామికవాడ ప్రమాద స్థలాన్ని సందర్శించి, సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు పలు మృతదేహాలను వెలికితీశారని, మరో 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోందని వివరించారు. పొట్టకూటి కోసం వలస వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *