సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్‌ను పోలీసులు అడుగుతున్న ప్రశ్నలివే!

Mana Enadu : హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సోమవారం రోజున నోటీసులు జారీ చేయడంతో మంగళవారం 11 గంటల సమయంలో బన్నీ ఠాణాకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా తన న్యాయవాదులతో కలిసి ఆయన విచారణకు హాజరయ్యాడు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌ విచారిస్తున్నారు.

సంధ్య థియేటర్ ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, సీఎం రేవంత్ అసెంబ్లీ ప్రకటన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ వంటి అంశాలపై పోలీసులు ఆయణ్ను ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలిసింది. అయితే విచారణ సందర్భంగా సంధ్య థియేటర్ లో పుష్ప-2 బెనిఫిట్ షో రోజు జరిగిన సంఘటనలను సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. దాదాపు రెండు గంటల పాటు జరగనున్న ఈ విచారణలో అల్లు అర్జున్ ను పోలీసులు అడగనున్న ప్రశ్నల్లో కొన్నింటిని చూద్దామా..

అల్లు అర్జున్‌ని అడగనున్న ప్రశ్నల్లో కొన్ని ఇవే..

  • సంధ్య థియేటర్ వద్దకు రోడ్ షోగా ఎందుకు వెళ్లారు?
  • థియేటర్ వద్దకు రావొద్దని యాజమాన్యం మీకు ముందే చెప్పిందా?
  • పోలీసుల అనుమతి లేదన్న విషయం మీకు తెలుసా?
  • థియేటర్ లో ప్రీమియర్ షోకు వస్తున్నట్లు అనుమతి కోరారా..? దానికి సంబంధించిన కాపీ ఉందా?
  • మీరు OR మీ పీఆర్ టీమ్ పోలీసుల అనుమతి తీసుకున్నారా?
  • సంధ్య థియేటర్ వద్ద ఉన్న పరిస్థితిని మీ పీఆర్ టీమ్ మీకు ముందే వివరించిందా?
  • తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకెప్పుడు తెలిసింది?
  • తొక్కిసలాట జరిగిన విషయాన్ని మీకెవరు చెప్పారు?
  • ఏసీపీ చెప్పినప్పుడే మీరెందుకు థియేటర్ నుంచి బయటకు వెళ్లలేదు?
  • రేవతి చనిపోయిన విషయం మరుసటి రోజు వరకు మీకు నిజంగా తెలియలేదా?
  • సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే తొక్కిసలాట విషయం తెలిసినా ఎందుకు బయటకు రాలేదు?
  • మీరొస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని థియేటర్ యాజమాన్యానికి ముందే చెప్పారా?
  • రోడ్ షో కోసం ఎంత మంది బౌన్సర్లను మీరు ఏర్పాటు చేసుకున్నారు ?

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *