TTD: అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల దర్శనం టికెట్ల విడుదల తేదీలివే!

తిరుమల తిరుపతి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కోటా అక్టోబర్‌(October) నెలకు సంబంధించి టికెట్ల విడుదల తేదీల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(Srivari Arjitha Seva Tickets)ను ఈనెల 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ లక్కీ డిప్‌(Electronic Lucky Dip for e-service tickets) కోసం ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ-సేవా టికెట్లు పొందిన భక్తులు ఈనెల 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లిస్తే లక్కీడిప్‌ టికెట్‌ మంజూరు అవుతుంది.

Tirupati Laddu Row: TTD Lodges Complaint Against TN Dairy For Supplying Substandard Ghee

సేవల టికెట్లు ఏ రోజు విడుదల చేస్తారంటే..

కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లు – జులై 22 ఉదయం 10 గంటలకు
☛ వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లు – జులై 22 మధ్యాహ్నం 3 గంటలకు
అంగప్రదక్షిణం టోకెన్లు(Angapradakshina tokens) – జులై 23 ఉదయం 10 గంటలకు
☛ శ్రీవాణి ట్రస్టు(Srivani Trust) ఆన్‌లైన్‌ కోటా టికెట్లు – జులై 23 ఉదయం 11 గంటలకు
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి ఉచిత ప్రత్యేక దర్శనం(Free special viewing) టోకెన్లు – జులై 23 మధ్యాహ్నం 3 గంటలకు
☛ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు – జులై 24 ఉదయం 10 గంటలకు
తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్‌ – జులై 24 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు
☛ TTD వెబ్‌సైట్‌లో https://ttdevasthanams.ap.gov.in మాత్రమే శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శనం టికెట్లు, గదులు బుక్ చేసుకోవాల‌ని TTD విజ్ఞప్తి చేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *