India vs America: భారత్‌పై ట్రంప్ ట్రేడ్ బాంబ్.. మరో 25శాతం టారిఫ్స్ పెంపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) పెట్రేగిపోతున్నారు. తమ ఆత్మీయ మిత్ర దేశం, ఆత్మీయ మిత్రుడు మోదీ(Modi) అంటూనే భారత్‌(India)పై ట్రంప్ ట్రేడ్ వార్(Trade War) ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సుంకాల(Tariffs) మీద సుంకాలు బాదేస్తున్నారు. భారత్‌ ఎగుమతుల(Exports)పై మరో 25 శాతం అదనంగా సుంకాలు పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌(Excutive Orders)పై సంతకం చేశారు. జులై 30న ప్రకటించిన 25 శాతం సుంకంతో కలిపితే తాజా పెంపుతో సుంకాలు 50 శాతానికి చేరాయి. దీంతో భారత్‌ నుంచి అమెరికా(US) దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై భారీ టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి.

రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకే..

కాగా రష్యా(Russia) నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్నందుకు ఈ చర్య తీసుకున్నట్లు ట్రంప్‌ తెలిపారు. మొదటి 25 శాతం సుంకం ఆగస్టు 7 నుంచి, తాజాగా ప్రకటించిన 25 శాతం సుంకం ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. భారత్‌ ప్రతీకార సుంకాలు విధిస్తే.. ఈ టారిఫ్‌లను మరింత పెంచి సవరించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని వైట్‌హౌస్‌(White House) హెచ్చరించింది. చైనా(Chaina)పై 51 శాతం, మలేసియాపై 25 శాతం, శ్రీలంకపై 30 శాతం, వియత్నాంపై 20 శాతం, జపాన్‌పై 15 శాతం చొప్పున యుఎస్‌ సుంకాలను విధించింది. పాకిస్థాన్‌పై విధించిన 19 శాతం సుంకాలతో పోల్చితే భారత్‌ను ట్రంప్‌ ఏ విధంగా ట్రీట్‌ చేస్తున్నారో స్పష్టమవుతోంది.

ట్రంప్‌ సుంకాల ప్రకటనలపై మోదీ స్పందించాలి: కాంగ్రెస్

అయితే అమెరికా చర్యలు అన్యాయమైనవని భారత విదేశాంగ శాఖ(Ministry of External Affairs of India) పేర్కొంది. ఈ సుంకాలు అసమంజసమైనవని విమర్శించింది. దేశానికి అవసరమైన అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. ట్రంప్‌ చర్యలను ప్రతిపక్షాల నేతలు తీవ్రంగా ఖండించారు. ట్రంప్‌ సుంకాల ప్రకటనలపై ఇప్పటికైనా ప్రధాని మోదీ(PM Modi) మౌనం వీడాలని డిమాండ్‌ చేశారు. ట్రంప్‌ టారిఫ్‌లపై ప్రధాని సమాధానం ఇవ్వాలని ఎక్స్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) డిమాండ్‌ చేశారు. ఈ సుంకాలు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *