ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ 3 శాతం పెంపు..?

సర్కార్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) తీపికబురు అందించబోతున్నట్లు సమాచారం. ఈ హోలీ పండుగకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలిసింది. ఈ పండుగ సందర్భంగా డీఏను (కరవు భత్యం) సరవణ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసారి కూడా డీఏను మరో 3 శాతం పెంచనున్నట్లు వెల్లడించాయి. దీంతో ప్రస్తుతం 53 శాతంగా ఉన్న డీఏ 56 శాతానికి చేరనుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

14వ తేదీన అధికారిక ప్రకటన

మార్చి 14వ తేదీన హోలీ పండుగ సందర్భంగా డీఏ (DA) పెంపుపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం 7వ వేతన సంఘం (7th Pay Commission) సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర సర్కార్ ప్రతి సంవత్సరం రెండు సార్లు ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పెంచాల్సి ఉంటుంది. జనవరి, జులైల్లో డీఏ పెంపు జరగాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మార్చి, అక్టోబరులో ప్రకటిస్తోంది. అయితే ప్రకటనలో ఆలస్యమైనా.. బకాయిలతో కలిపి చెల్లిస్తోంది.

Related Posts

ఉగ్రదాడి వేళ మంచి మనసు చాటుకున్న కశ్మీరీలు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు

పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న…

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *