విలక్షణ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. రాబరీ చుట్టూ సాగే ‘ఏస్’ ఈ మధ్యే రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఆయన నటించి ‘మిస్కిన్’ ఆగస్ట్లో, ‘గందీ టాక్స్’ మూవీ అక్టోబర్లో రిలీజ్ కానుంది.
మధ్య తరగతి కుటుంబంలోని భార్యాభర్తల పాత్రల్లో..
టాలెంటెడ్ నటి నిత్యా మేనన్తో (Nithya Menen) జతకట్టి చేసిన మూవీ ‘తలైవాన్ తలైవి’ (Thalaivan Thalaivi). పలు హిట్ చిత్రాలు తీసిన పాండిరాజ్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాను తెలుగులో ‘సార్ మేడమ్’ (Sir Madam) పేరుతో విడుదల చేస్తున్నారు. మూవీ టైటిల్ టీజర్ను తాజాగా రిలీజ్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత నిత్యా మేనన్ నటిస్తున్న మూవీ ఇది. ఓ మధ్య తరగతి కుటుంబంలోని భార్యాభర్తల పాత్రల్లో నిత్యా మేనన్, విజయ్ సేతుపతి కనిపించి ఆకట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో జులై 25 రిలీజ్ కానుంది.






