Vijay Sethupathi: ఆమె ఫేమస్​ కావడం కోసమే ఆరోపణలు.. ఎంజాయ్​ చేయనివ్వండి!

వర్సటైల్​ యాక్టర్​ విజయ్​ సేతుపతి (Vijay Sethupathi) ఇండస్ట్రీతో సంబంధం లేకుండా తమిళ్, తెలుగు, హిందీ మూవీస్​ చేస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్నారు. నిత్యా మేనన్​తో కలిసి నటించిన మూవీ ‘సార్​ మేడమ్​’ ఆగస్టు 1న థియేటర్లలో రిలీజ్​ కానుంది. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతిపై ఇటీవల ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్​ లో క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) బాగా ఉందని, తన ఫ్రెండ్​ ను విజయ్​ సేతుపతి ఇబ్బంది పెట్టారని ఆమె సోషల్​ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ వ్యవహారం హాట్​ టాపిక్​గా మారింది.

సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్

సదరు మహిళ ఆరోపణలపై విజయ్ సేతుపతి స్పందించారు. ఈ రకమైన తప్పుడు ఆరోపణలు తనను బాధించలేవని అన్నారు. “నన్ను ఎన్నోఏళ్లుగా చూస్తున్నవారంతా ఆమె ఆరోపణలు చూసి నవ్వుకున్నారు. నేనేంటో నాకు తెలుసు. ఈ తరహా తప్పుడు ఆరోపణలు నన్ను బాధపెట్టలేవు. కానీ, నా కుటుంబం, ఫ్రెండ్స్​ ఎంతో ఇబ్బంది పడ్డారు. ‘వీటిని పట్టించుకోకండి. ఆమె ఫేమస్ కావడం కోసం కావాలని ఇలా చేస్తోంది. కొన్ని నిమిషాలపాటు హైలైట్ అవుతుంది. పాపం ఎంజాయ్ చేయనీయండి’ అని వారితో చెప్పాను. అని సేతుపతి అన్నారు. సదరు మహిళపై సైబర్ క్రైమ్​‌లో కంప్లైంట్​ కూడా చేశానని చెప్పారు. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని, కానీ ఇప్పటివరకూ దేనికీ భయపడలేదన్నారు. ఇలాంటివి ఎప్పటికీ తనను బాధించలేవని పేర్కొన్నారు.

ఇదీ జరిగింది..

కోలీవుడ్​ లో క్యాస్టింగ్ కౌచ్ చాల ఎక్కువగా ఉందని.. దీనివల్ల తన ఫ్రెండ్​ ఎంతో ఇబ్బందిపడిందని రమ్య అనే ఓ మహిళ ఎక్స్​లో పోస్ట్ పెట్టింది. మానసికంగా కుంగుబాటుకు గురైందని పేర్కొంది. విజయ్ సేతుపతి కూడా ఆమెను ఇబ్బందిపెట్టారని ఆరోపించింది. అయితే ఆ పోస్ట్​ చేసిన కొన్ని గంటల్లో డిలీట్ చేసింది. కానీ అప్పటికే అది వైరల్​ అయ్యింది. కోలీవుడ్‌ లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆ మహిళ మరో పోస్ట్ పెట్టి వివరణ ఇచ్చింది. కోపంలో ఇలా చేశానని.. అది వైరల్ అవుతుందని ఊహించలేదని తెలిపింది. తన ఫ్రెండ్​ ప్రైవసీ కోసం పోస్ట్ డిలీట్ చేసినట్లు పేర్కొంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *