Kannappa: ‘కన్నప్ప’కు సెన్సార్ కష్టాలు.. 13 సీన్లపై అభ్యంతరం

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీల్లో హీరో మంచు విష్ణు(Manchu Vishnu) నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప(Kannappa)’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ మూవీ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. పూర్తి మైథలాజికల్ చిత్రంగా డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దీనిని తెరకెక్కించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్(Promotional Content) ఈ మూవీపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే, ఈ సినిమా రిలీజ్‌కు మరింత చేరువ కావడంతో ఈ చిత్రానికి ఇప్పుడు సెన్సార్(Sensor) కష్టాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

బ్రాహ్మణ చైతన్య వేదిక అభ్యంతరాలు

ఇంతకీ విషయమేంటంటే.. ఈ సినిమాలో బ్రాహ్మణ వర్గాని(Brahmin community)కి సంబంధించిన పాత్రలపై బ్రాహ్మణ చైతన్య వేదిక(Brahmin Chaitanya Vedika) తీవ్ర అభ్యంతరాలు చెప్పిందని సోషల్ మీడియా(SM)లో వార్తలొస్తున్నాయి. దీంతో సెన్సార్ బోర్డు(Sensor Board) కూడా ఈ విషయంపై సినిమాను చూసిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. ఇక ఈ సినిమాను చూసిన మంది సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాలోని 13 సీన్స్‌పై అభ్యంతరం తెలిపారట.

జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌ 

ఈ సీన్స్‌ను తొలగించాలని వారు కన్నప్ప చిత్ర యూనిట్‌కు సూచించినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), మోహన్‌లాల్‌ (Mohanlal), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) తదితర స్టార్‌ హీరోలు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌ కానుంది. ఈ సినిమాను మోహన్ బాబు(Mohan Babu) భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *