India vs Pakistan: రేపే సెమీస్.. పాకిస్థాన్‌తో భారత్ ఆడుతుందా?

పోరు ఏదైనా భారత్-పాకిస్థాన్‌(India-Pakistan)పై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకుంటుంది. ఇక క్రీడల్లో ముఖ్యంగా క్రికెట్(Cricket) విషయానికొస్తే ఆ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ జట్లు మరోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్(World Championship of Legends 2025) టోర్నీలో రేపు ఇరు జట్ల మధ్య సెమీఫైనల్(Semifinal) మ్యాచ్ జరగనుంది. నిన్న వెస్టిండీస్ ఛాంపియ‌న్స్‌ను చిత్తుచేసి ఇండియా ఛాంపియ‌న్స్ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్స్ లెజెండ్ (WCL) సెమీ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌కు చేరాలంటే 14.1 ఓవ‌ర‌ల్లో ల‌క్ష్యాన్ని ఛేదించాల్సి ఉండ‌గా 13.2 ఓవ‌ర్ల‌లోనే గెలుపొందింది.

విండీస్‌పై విజయంతో సెమీస్‌కు

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 144 ర‌న్స్ చేసింది. ఛేజింగ్‌లో టీమిండియా(Team India) ఆట‌గాళ్లు స్టువ‌ర్ట్ బిన్నీ (50 నాటౌట్‌), శిఖ‌ర్ ధవ‌న్ (25), యువ‌రాజ్ సింగ్ (21 నాటౌట్‌), యూసుఫ్ ప‌ఠాన్ (21) చెల‌రేగి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. లీగ్‌లో ఒకే మ్యాచ్ గెలిచిన‌ప్ప‌టికీ మెరుగైన ర‌న్‌రేట్‌తో ఇండియా ఛాంపియ‌న్స్ సెమీస్‌కు అర్హ‌త సాధించింది. ఇక‌, సెమీస్‌కు దూసుకెళ్లిన భార‌త్ రేపు ఇంగ్లండ్‌(England)లోని ఎడ్జ్‌బాస్ట‌న్‌లో సాయంత్రం 5 గంట‌ల‌కు (IST) పాకిస్థాన్‌(Pakistan)తో త‌ల‌ప‌డాల్సి ఉంది.

India vs Pakistan Live Streaming: When & How To Watch IND vs PAK World Championship of Legends 2024 Final? - myKhel

లీగ్ మ్యాచ్ బాయ్‌కాట్ చేసిన భారత్

అయితే, ఇటీవల పహల్గామ్ ఉగ్ర ఘటన(Pahalgam terror incident) తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో లీగ్ ద‌శ‌లో ఓ మ్యాచ్‌ను భార‌త ఆట‌గాళ్లు బాయ్‌కాట్ చేశారు. దీంతో టోర్నీ మేనేజ్‌మెంట్ పాక్‌తో మ్యాచ్‌ను ర‌ద్దు చేసి చెరో పాయింగ్ కేటాయించింది. ఇప్పుడు సెమీఫైన‌ల్ మ్యాచ్‌నూ ఇండియా ఛాంపియ‌న్స్ బాయ్‌కాట్ చేస్తే పాక్ ఫైన‌ల్‌కు వెళ్లే అవ‌కాశ‌ముంది. దీంతో రేపు దాయాదితో భార‌త్ ఆడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *