Women Murder: మహిళపై హత్యాచారం?.. కూటమి సర్కార్‌పై వైసీపీ ఫైర్

గుంటూరు(Guntur) జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి కొలనుకొండ వద్ద దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతంగా గొంతుకోసి హతమార్చారు. జాతీయ రహదారి సర్వీసు రోడ్డు పక్కన ఓ బార్ అండ్ రెస్టారెంట్ వెనుక మహిళపై అత్యాచారం(Rape) చేసి హత్య(Murder) చేసినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందిచడంతో హుటాహుటిన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్న గుంటూరు SP సతీశ్ కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతంచేయాలని, నేరస్థులను గుర్తించి త్వరితగతిన అరెస్ట్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

రాష్ట్రంలో మహిళలపై రోజుకో అమానుష ఘటన: YCP

ఇదిలా ఉండగా ఈ ఘటనపై YCP స్పందించింది. రాష్ట్రంలో మహిళలపై రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడింది. రెడ్ బుక్(Red Book) రాజ్యాంగంతో పాలనను గాలికి వదిలేసి ఇంకెంత మంది ఆడబిడ్డల మానప్రాణాలు తీస్తారంటూ మంత్రి లోకేశ్‌(Lokesh)ను ప్రశ్నించింది. రాష్ట్రంలో మహిళలపై రోజుకో దారుణం జరుగుతున్నా పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం కామెడీ స్కిట్లతో కాలక్షేపం చేస్తోందని విమర్శించింది. ఈ ఘటనలో నిందితులను తక్షణమే పట్టుకుని శిక్షించాలని హోమంత్రి అనిత(Home Minister Anitha)ను కోరింది.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

Hyderabad Crime: దారుణం.. ప్రెగ్నెంట్ అయిన భార్యను ముక్కలుగా నరికిన భర్త

హైదరాబాద్‌లోని మేడిపల్లి(Medipally) పరిధి బాలాజీహిల్స్‌(Balaji Hills)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతియైన భార్య జ్యోతి(25)ని భర్త మహేందర్ రెడ్డి(Mahendar Reddy) కిరాతకంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన ఈ దంపతులు ప్రేమ వివాహం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *