బాలికపై అత్యాచారం.. ‘ఫన్‌ బకెట్‌’ ఫేమ్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

టిక్ టాక్ వీడియోలు చేద్దామంటూ ఓ బాలికను ఇంటికి పిలిచాడు. అలా ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి (Minor Girl Rape) పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి పరువు తీస్తానంటూ బెదిరించాడు. అయితే కొన్నాళ్ల తర్వాత ఆ బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె 4 నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. ఆమె తల్లి ఆ పాపను మందలించగా అసలు విషయం బయటకు వచ్చింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..?

యూట్యూబర్, ఫన్ బకెట్ ఫేం చిప్పాడ భార్గవ్ యూట్యూబ్ (Youtuber Bhargav) లో షార్ట్ వీడియోస్ తీస్తూ ఫేమస్ అయ్యాడు. అయితే టిక్ టాక్ వీడియోలు తీద్దామంటూ ఓ బాలికక ఆశచూపి తన నివాసానికి తీసుకెళ్లాడు. అలా వీడియోల పేరుతో ఇంటికి తీసుకెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే వీడియోలన్నీ నెట్టింట పోస్టు చేస్తానంటూ బెదిరించడంతో ఆ బాలిక నోరు మెదపలేదు.

ఇంటికి పిలిచి పలుమార్లు రేప్

అయితే కొన్నాళ్లకు ఆమెకు కడుపు నొప్పి రావడంతో తల్లికి చెప్పింది. తల్లి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఆ బాలిక 4 నెలల గర్భవతి అని తేల్చారు. ఈ విషయంపై కూతుర్ని మందలించగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో బాలిక తల్లి 2021లో భార్గవ్ పై విశాఖలో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో కేసు నమోదు చేయగా.. తాజాగా విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు (Visakha Special Pocso Court) ఈ కేసులో తీర్పు వెల్లడించింది.

20 ఏళ్లు జైలు శిక్ష

ఈ సందర్భంగా మైనర్ బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన ఫన్ బకెట్ భార్గవ్ కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే 4 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని బాధితురాలికి పరిహారంగా ఇవ్వాలని తీర్పును ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *