పవన్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ : వైఎస్ జగన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ (YS Jagan) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కూటమి సర్కారుపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పవన్ పై తీవ్ర కామెంట్లు చేశారు. పవన్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ విమర్శించారు. పవన్‌ జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారని పేర్కొన్నారు.

ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా?

అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయని వైఎస్ జగన్ (YS Jagan Press Meet) అన్నారు. ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా అని ప్రశ్నించారు. 175 మందిలో ఒకరికి ఇచ్చినట్టు టైమ్ ఇస్తామంటే ఎలా అని అడిగారు. సభలో ఇంతమంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని ఎక్కడా రూల్‌ లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు(Chandrababu Naidu)కు ప్రతిపక్ష హోదా తానే ఇచ్చానని.. ఎంతసేపైనా మాట్లాడమని చంద్రబాబుకు మైక్ ఇచ్చానని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు రిగ్గింగ్ చేశారని జగన్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర టీచర్ ఓటర్లు బుద్ధి చెప్పారని జగన్ వ్యాఖ్యానించారు.

అది కూడా అమలు చేయలేదు

“నిరుద్యోగులకు రూ.3 వేల భృతి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Ride For Women).. తల్లికి వందనం.. ఉద్యోగ కల్పన.. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు.. ఏడాదికి ఒక్కక్కరికి మూడు సిలిండర్లు ఇస్తామని ఇలా వివిధ రకాల హామీలు ఇచ్చిన కూటమి అధికారంలోకి రాగానే వాటిని మరిచిపోయింది. ఇప్పటికీ ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారు. 50 ఏళ్లకే పింఛను ఇస్తామని చెప్పారు. అది కూడా అమలు చేయడం లేదు. నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావనే లేదు. ప్రతి మహిళకు సీఎం చంద్రబాబు రూ.36వేలు బాకీ పడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం చాలా చిన్నపథకం. అది కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేకపోయింది.” అని జగన్ విమర్శించారు.

Related Posts

Srisailam Reservoir: కృష్ణమ్మకు ఏపీ సీఎం జలహారతి.. నేడు తెరుచుకోనున్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు

శ్రీశైలం జలాశయాని(Srisailam Reservoir)కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల(Heavy Rains) వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద(flood) నీరు వచ్చి చేరుతోంది. సుంకేసుల(Sunkesula), జూరాల(Jurala) నుంచి 1,72,705 క్యూసెక్కుల నీటి ప్రవాహం…

Social Media: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు.. సోషల్ మీడియాపైనే నేతల కన్ను!

డిజిటల్‌ యుగంలో సామాజిక మాధ్యమాల(Social Media)ను ఉపయోగించుకుని అన్ని పార్టీలు(Political Parties) తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తెలంగాణ(Telangana)లో తర్వలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections) నేపథ్యంలో ఆయా ప్రధాన రాజకీయ పార్టీలు SMను మరో ప్రధానాస్త్రంగా ఎంచుకుంటున్నాయి. ఓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *