బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆదిత్య 369’ రీ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. గతంలో రిలీజ్ అయి ప్రేక్షకుల మనసు గెలిచిన చిత్రాలు మరోసారి వారికి వినోదం పంచేందుకు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. మరోవైపు మొదటి సారి విడుదలైనప్పుడు ప్రేక్షకులను పెద్దగా అలరించని.. ఆ తర్వాత టీవీల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను మరోసారి రిలీజ్ చేస్తే వెండితెరపై చూడాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి చిత్రాలను కూడా నిర్మాతలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక రీ రిలీజ్ లకు కూడా విపరీతంగా ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాలు మరోసారి నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ జాబితాలో చేరబోతోంది నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన ఆదిత్య369 సినిమా.

బాలయ్య నటించిన క్లాసిక్ చిత్రాల్లో ఒకటి ఆదిత్య 369 (Aditya369). సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటి ప్రేక్షకులే కాదు ఈ సినిమా ఈ తరం ఆడియెన్స్ నూ మెప్పించింది. చాలా మంది యూట్యూబ్ లో ఈ సినిమాను వీక్షించారు. అయితే మరొక్కసారి ఈ సినిమాను వెండితెరపై చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో వారి కోరిక మేరక్ మేకర్స్ ఆదిత్య 369 సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని ప్రకటించారు కూడా.

అయితే తాజాగా మేకర్స్ ఆదిత్య 369 సినిమా రీ రిలీజ్ డేట్ (Aditya369 Re Release Date) ను ప్రకటించారు. ఈ చిత్రం వచ్చిన 34 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. అయితే మొదట సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేయాలని భావించారు. కానీ తాజాగా బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ ఓ నెల ముందుగానే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆదిత్య 369 చిత్రాన్ని ఏప్రిల్ 4వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలయ్య, మోహిని, అమ్రిష్ పురి, టినూ ఆనంద్, సుత్తివేలు కీలక పాత్రల్లో నటించారు. ఎస్. అనిత కృష్ణ ఈ సినిమాను నిర్మించారు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందింది.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *