5, 8 తరగతుల్లో పాస్​ కాకపోతే మళ్లీ చదవాల్సిందే

దేశంలో స్కూల్​విద్యకు (school education) సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5, 8 తరగతుల విద్యార్థులకు ఇప్పటివరకు అమల్లో ఉన్న నో డిటెన్షన్ విధానాన్ని(No-detention policy) రద్దు చేసింది.ఈ నిర్ణయంతో ఇకపై ఫైనల్​ఎగ్జామ్​లో పాస్​కాని 5, 8 తరగతుల (5, 8 classes) విద్యార్థులు మళ్లీ అదే క్లాసుల్లో చదవాల్సి ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు ఈ నిబంధన వర్తించనుంది.

మళ్లీ పరీక్ష రాసేందుకు ఛాన్స్
వార్షిక పరీక్షల్లో స్టూడెంట్లు హైక్లాసులకు ప్రమోట్ కావడంలో ఫెయిలైతే మళ్లీ పరీక్ష రాసేందుకు కొంత సమయం ఇవ్వనున్నారు. ఫలితాల ప్రకటన తేదీకి రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో కూడా ఒకవేళ ఫెయిలైతే.. ఆ స్టూడెంట్లు మళ్లీ ఆయా తరగతుల్లోనే చదవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు 3వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తిస్తుందని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం
2019 మార్చిలో విద్యాహక్కు చట్టంలో చేసిన సవరణల ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు (No-detention policy for 5, 8 classes) తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయి. స్కూల్​ విద్య రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని అధికారి చెప్పారు.

 

Related Posts

AI: ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఈ ఐదు కోర్సులు పూర్తిగా ఉచితం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖ మంచి అవకాశాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ‘స్వయం పోర్టల్‌’ ద్వారా ఉచిత ఏఐ కోర్సులను( Free AI courses)…

APPSC బంపర్ ఆఫర్.. కొత్త రిక్రూట్‌మెంట్ నోటీసులు విడుదల

రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) త్వరలోనే భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల( Notices Released) చేయనుంది. ప్రస్తుతం మొత్తం 18 నోటిఫికేషన్లు సిద్ధంగా ఉండగా, అందులో 12కుపైగా క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు సంబంధించినవిగా తెలుస్తోంది. అయితే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *