పహల్గాం ఉగ్రదాడి ఘటన (Pahalgam Attack)కు ప్రతీకారంగా ఆ దేశంతో ఉన్న సంబంధాలను భారత్ పూర్తిగా తెంపేసుకుంటోంది. ఇప్పటికే భారత్ లో ఉన్న ఆ దేశ పౌరులందర్నీ తమ స్వస్థలాలకు పంపిస్తోంది. మరోవైపు సింధు జలాల ఒప్పందం రద్దు, వాఘా-అటారీ సరిహద్దు మూసివేసింది. ఇందులో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
16 ఛానెళ్లు బ్యాన్
పాకిస్థాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్ల(Pakistan YouTube Channels)పై కేంద్రం నిషేధం విధించింది. కేంద్ర హోం శాఖ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. డాన్ న్యూస్, సమా, జియో న్యూస్, ARY తదితర 16 యుట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించినట్లు తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత రెచ్చగొట్టే ప్రచారం, మతపరమైన సమస్యాత్మక కంటెంట్, తప్పుదారి పట్టించే సమాచారం ప్రసారం చేయడమే కాకుండా భారత్, సైనిక బలగాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొంటూ వీటిని బ్యాన్ చేసింది.
On the recommendations of the Ministry of Home Affairs, the Government of India has banned the 16 Pakistani YouTube channels including Dawn News, Samaa TV, Ary News, Geo News for disseminating provocative and communally sensitive content, false and misleading narratives and… pic.twitter.com/AusR1fCkvN
— ANI (@ANI) April 28, 2025






