KTR: నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి: కేటీఆర్ సంచలన కామెంట్స్

సీఎం రేవంత్ రెడ్డి అవినీతి బండారం బట్టబయలు అయిందని నేషనల్ హెరాల్డ్ కేసులో (National Herald case) సీఎం పేరు చేర్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఈడీ నమోదు చేసిన చార్జీషీట్ లో యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభపెట్టాడని ఉందన్నారు. దీంతో రేవంత్ ఏ మేరకు అవినీతి చేశాడో బట్టబయలైందన్నారు.

సీఎం కాకముందే..

ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం , వేల కోట్ల అవినీతి వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అడ్డంగా ఇరుక్కుపోయారని కేటీఆర్ అన్నారు. సీఎం కుర్చీ ఎప్పుడు పోతుందోనని రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు.

30 పర్సంటేజీ లేనిదే…

కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్క ఫైలు కదలడం లేదని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చెప్పడం కాంగ్రెస్ అవినీతికి పరాకాష్ట అన్నారు. 30 శాతం పర్సంటేజీ ఇవ్వనిదే పనులు కావడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) చెప్పడంతో నిజస్వరూపం బయటపడిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని కేటీఆర్ విమర్శించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *