రేషన్ బియ్యం కేసులో పేర్ని నాని సతీమణికి నోటీసులు

Mana Enadu :  రేషన్‌ బియ్యం మాయం కేసులో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) భార్య జయసుధకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి.  కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ తాజాగా నోటీసులు ఇచ్చారు. గోదాములో బియ్యం మాయం కావడంపై ఇటీవల పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

రూ.1.67 కోట్లు చెల్లించాలి

ఈ క్రమంలో తొలుత 185 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం (Ration Rice Scam) షార్టేజీ వచ్చినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.  ఇందుకోసం ఆమె ఇప్పటికే రూ.1.68 కోట్లు జరిమానా చెల్లించినట్లు వెల్లడించారు. తాజాగా ఈ వ్యవహారంలో పూర్తి దర్యాప్తు చేపట్టిన అధికారులకు  మొత్తం 378 మెట్రిక్‌ టన్నుల బియ్యం మాయమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో పెరిగిన షార్టేజీకి కూడా జరిమానా చెల్లించాలని జయసుధకు మరోసారి నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *