ప్రముఖ కోలీవుడ్ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువు షిహాన్ హుసైని (60) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు. హుసైని (Shihan Hussaini) మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గురువుగా షిహాన్
ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు హుసైని.. మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్లో శిక్షణ ఇచ్చారు. ఇక షిహాన్ హుసైని సినిమాల సంగతికి వస్తే.. 1986లో విడుదలైన ‘పున్నగై మన్నన్’ సినిమా ద్వారా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పలు చిత్రాల్లో నటించిన ఆయనకు విజయ్ హీరోగా నటించిన ‘బద్రి (Badri Movie)’ సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇక షిహాన్.. ఆర్చరీలోనూ ట్రైనింగ్ ఇచ్చే వారు. ఆ రంగంలో 400 మందికి పైగా విద్యార్థులను తయారు చేశారు షిహాన్.






