ఇండియన్ మైఖేల్ జాక్సన్.. డ్యాన్స్ కీ దేవా.. ప్రభుదేవా (Prabhu Deva) గురించి తెలియని వారుండరు. ఇటు సౌత్ ఇండియా, అటు నార్త్ ఇండియా.. హోల్ ఇండియాలో డ్యాన్స్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ప్రభుదేవాదే. ఎందరో మహా నటులతో స్టెప్పులు వేయించాడు. ప్రభుదేవా కొరియోగ్రఫీ అంటే హీరోలు కూడా చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఇంతటి గొప్ప పేరు సంపాదించుకున్న ఈ డ్యాన్స్ కొరియోగ్రఫర్ వారసుడు ఎవరనేది ఎప్పుడూ చర్చకు రాలేదు. కానీ తాజాగా ప్రభుదేవా తన వారసుడిని పరిచయం చేశారు.
Proud to introduce my son Rishii Ragvendar Deva, as we share the spotlight for the first time! This is more than dance—it’s legacy, passion, and a journey that’s just getting started. 🙏❤️❤️❤️ pic.twitter.com/L00r6VN5Kc
— Prabhudheva (@PDdancing) February 25, 2025
ప్రభుదేవా వారసుడొచ్చాడు
చెన్నైలో ‘ప్రభుదేవా లైవ్ డ్యాన్స్ వైబ్ (Prabhu Deva Live Dance Vibe)’ పేరుతో ఈ ఇండియన్ మైఖేల్ జాక్సన్ ఓ కన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు వివిధ సినిమా రంగాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలోనే ప్రభుదేవా తన వారసుడిని పరిచయం చేశారు. తన కుమారుడు రిషి రాగ్వేందర్ దేవా (Rishi Ragvendar Deva)ను పరిచయం చేసిన ప్రభుదేవా అతడి ఫస్ట్ స్టేజ్ పర్ఫామెన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. మరి మీరు కూడా చూసేయండి ఓసారి.
View this post on Instagram
ఇది అంతకంటే ఎక్కువ
ఇక ఈ వీడియో పోస్టు చేసిన ప్రభుదేవా దానికింద ఓ ఎమోషనల్ పోస్టు రాసుకొచ్చారు. ‘నా కుమారుడు రిషి రాగ్వేందర్ దేవాను మీ అందరికి పరిచయం చేయడం చాలా గర్వంగా ఉంది. మేమిద్దరం కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. ఇది కేవలం మా డ్యాన్స్ పర్ఫామెన్స్ కాదు. అంతకంటే ఎక్కువ. ఇది నా వారసత్వం. ఇప్పుడే మొదలవుతున్న నా వారసుడి జర్నీ. దీనికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.’ అని ప్రభుదేవా రాసుకొచ్చారు. ఇక ప్రభుదేవాకు ఇద్దరు పిల్లలు. అందులో ఒకరు రిషి రాగ్వేందర్ కాగా.. మరొకరు అదిత్.






