Kingdom OTT: ఓటీటీలోకి విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

 

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన తాజా తెలుగు యాక్షన్ డ్రామా ‘కింగ్‌డమ్(Kingdom)’ థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీ(OTT)లో సందడి చేయనుంది. గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దాదాపు రూ.53 కోట్లకు సొంతం చేసుకుంది. ఆగస్టు 28 లేదా 29 నుంచి ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుందని సమాచారం.

Image

‘స్పై మిషన్‌’లో ఆకట్టుకున్న విజయ్ పోరాటం

కాగా ‘కింగ్‌డమ్’ సినిమా ఒక పోలీస్ కానిస్టేబుల్‌గా ప్రారంభమై, గూఢచారి(Spy)గా మారి, శ్రీలంక(Srilanka)లో ఒక ప్రమాదకరమైన నేరస్థుడిని పట్టుకునే మిషన్‌లో విజయ్ దేవరకొండ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse), సత్యదేవ్, వెంకటేష్ వీపీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichandar) సంగీతం సమకూర్చగా, జోమన్ టీ జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందించారు. థియేటర్ వెర్షన్‌లో కత్తిరించిన ఒక రొమాంటిక్ సాంగ్ ‘హృదయం లోపల’ అనే సాంగ్‌తోపాటు ఓ యాక్షన్ సీన్‌ను కూడా ఓటీటీ వెర్షన్‌లో చేర్చనున్నట్లు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి వెల్లడించారు.

రూ.130 కోట్ల బడ్జెట్‌తో..

కాగా ఈ మూవీ థియేటర్లలో రూ.50.55 కోట్లకుపైనే వసూలు(Collections) చేసింది. అయితే రూ.130 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా బాక్సాఫీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. శ్రీలంక తమిళ ప్రజల చిత్రణపై వివాదం కూడా ఎదురైంది, దీనిపై చిత్ర బృందం క్షమాపణ వ్యక్తం చేసింది. ఓటీటీ విడుదలతో ‘కింగ్‌డమ్’ మరింత విస్తృత ప్రేక్షకులను చేరుకుని, కొత్త జోష్‌ను సంతరించుకునే అవకాశం ఉంది. ఇక ఈ మూవీని థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *