అద్దె ఇళ్లలో నివసించే వారికి ఇక నో టెన్షన్‌ 

మన Enadu: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా అమల్లోకి తెచ్చిన గృహజ్యోతి పథకం అద్దె ఇళ్లలో ఉండేవారికి వర్తించనుంది. 200 యూనిట్ల లోపు కరెంట్‌ వాడే గృహ విద్యుత్ వినియోగదారులు ఎలాంటి బిల్లులు చెల్లించనవసరం లేదు. అర్హులైన వారికి జీరో బిల్లులు రాకుంటే సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారులుగా గుర్తిస్తామని అధికారులు ప్రకటించారు.

Gruha Jyothi Schem In Telangana : కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ఆరుగ్యారెంటీల్లో ఒక్కటైనా గృహజ్యోతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు గత నెల 27న ప్రారంభించారు. నిరుపేదలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గించే సదాశయంతో తెచ్చిన ఈ పథకం అమలుకు ప్రభుత్వం భారీ కసరత్తే చేసింది. మీటర్ రీడర్లు తమ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు చేసి ఇంటింటికీ వెళ్లి తెల్ల రేషన్ కార్డు, ఆధార్, మొబైల్ నంబర్ వివరాలను మీటర్ రీడింగ్ మిషన్లలో నిక్షిప్తం చేశారు.

గృహజ్యోతి పథకం : రేషన్ కార్డు, ఆధార్ కార్డులు వినియోగదారుల నుంచి సేకరించే ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున అర్హుల సంఖ్య మరింత పెరగుతుందని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆహార భద్రత కార్డులకు ఆధార్‌ అనుసంధానమై, యూనిక్‌ సర్వీస్‌ కనెక్షన్‌ ఉంటే ఆ వివరాలు పొందు పరిచి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. జీరో విద్యుత్‌ బిల్లు (Zero Current Bill) రాని అర్హులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు నకళ్లతో విద్యుత్ రెవెన్యూ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గృహజ్యోతి పథకం అమలు కోసం తొలుత కర్ణాటక తరహాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం భావించినా తర్వాత ఆలోచనను విరమించుకుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *