“గదర్ 2” సెన్సేషన్..డే 6 కూడా రికార్డు వసూళ్లు

లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర భారీ వసూళ్లతో డూమ్ లేపుతున్న నయా చిత్రం “గదర్ 2”. దర్శకుడు అనిల్ శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటించగా అమీషా పటేల్ అయితే హీరోయిన్ గా నటించింది. మరి ఈ చిత్రం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్ తో వచ్చినప్పటికీ ట్రేడ్ వర్గాలు షాక్ అయ్యేలా ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకుంది.

అంతే కాకుండా నార్త్ లో అయితే సీక్వెల్స్ లో ఓ బెంచ్ మార్క్ వసూళ్లు కొల్లగొడుతుండగా లేటెస్ట్ గా కూడా భారీ మార్క్ 200 కోట్ల మార్క్ ని కూడా క్రాస్ చేసి అదరగొట్టింది. ఇక ఈ చిత్రం అయితే లేటెస్ట్ గా ఆరవ రోజు కూడా సూపర్ స్టాండర్డ్ వసూళ్లు రాబట్టినట్టుగా తెలుస్తుంది. మరి డే 6 అయితే ఈ చిత్రం 32.37 కోట్ల గ్రాస్ ని అందుకోగా 6 రోజుల్లో ఈ చిత్రం మొత్తం 261.35 కోట్ల గ్రాస్ ని ఇప్పటివరకు అయితే రాబట్టింది. అలాగే వరుసగా ఆరు రోజులు పాటు 30 కోట్లకి పైగా వసూళ్లు అయితే అందుకున్న అతి కొద్ది చిత్రాల్లో ఒకటిగా “గదర్ 2” నిలిచింది.

గదర్ 2 చిత్రం రిలీజ్ తర్వాత పాకిస్థాన్‌ను పరేషాన్ చేశామనే వాదనలో బలం లేదు. ఎందుకంటే వారిని అసంతృప్తికి గురి చేయలేదు. మీరు చెప్పి చెప్పి వార్తలు రాయడం వల్ల ఆ వాదన అలా ప్రచారమైంది. నేను వాఘా బోర్డర్ వద్దకు వెళ్లినప్పుడు పాకిస్థాన్ ప్రజలు నాతో చాలా స్నేహంగా ఉన్నారు. నన్ను చూసి చాలా సంతోషంగా చేతులు ఊపారు. అంతకంటే వారి నుంచి కావాల్సిన ప్రేమ ఏముంది అని సన్నీడియోల్ అన్నారు.

గదర్ 2 సినిమా ప్రేక్షకుల అంచనాలు లేకపోతే ఇలాంటి రెస్సాన్స్, ఆదరణ ఉండేది కాదు. ప్రతీ ఒక్కరు ఈ సినిమాపై చూపిస్తున్న ప్రేమకు చాలా ఆనందం కలుగుతున్నది. చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నామని చెప్పడం ఇంకా ఆనందం కలిగిచింది. ఆ విషయం తెలిసినప్పుడు కలిగిన తృప్తి మాటల్లో చెప్పలేం అని సన్నీడియోల్ అన్నారు.

  • Related Posts

    Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

    టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

    Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

    కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *