Bigg Boss 8: హౌస్ నుంచి ఇవాళ ఇద్దరు ఔట్!

Mana Enadu : అప్పుడే బిగ్ బాస్ సీజన్-8 (Bigg Boss 8) తెలుగులో నాలుగో వారం కూడా ముగిసేందుకు వచ్చింది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం నామినేషన్లలో డేంజర్​ జోన్​లో సోనియా (Sonia) ఆకుల ఉంది. ఆమెతో పాటు ఈ వారం నామినేషన్​లో ఆరుగురు హౌజ్​మేట్స్ ఉన్నారు. సోనియా, నైనిక, పృథ్వీ శెట్టి, నబిల్, ప్రేరణ కంబం, నాగ మణికంఠలో ఇవాళ డబుల్ ఎలిమినేషన్ ఉండనుందట.

డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు

ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యేందుకు డేంజర్ జోన్‌కి వచ్చే ఇద్దరి క్యాండెట్స్‌లో ఒకరు మణికంఠ (Manikanta) అని శనివారం ఎపిసోడ్ లో నాగార్జున (Nagarjuna) ముందే ఫిక్స్ చేశారు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో మణింకఠ ఎలాగూ డేంజర్ జోన్ కాబట్టి.. మిగిలిన ఐదుగురులో నబీల్‌ ను సేవ్ చేశారు.  మిగిలిన వారిలో ఎవరు సేవ్​ అయ్యారు అనే విషయాన్ని నేటి(ఆదివారం) ఎపిసోడ్​లో చెప్పనున్నారు. అన్​ అఫీషియల్​ పోల్స్​లో మొదటి స్థానంలో నబీల్​ ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో వరసగా ప్రేరణ, మణికంఠ, ఆదిత్య, పృథ్వీ, సోనియా ఉన్నారు.

డబుల్ ఎలిమినేషన్

వీరిలో మణికంఠతో పాటు మరో కంటెస్టెంట్​ సోనియా కూడా డేంజర్ జోన్‌ లో ఉందట. వీరిద్దరిలో సోనియాను ఎలిమినేట్​ చేసినట్లు సోషల్​ మీడియాలో న్యూస్​ వైరల్​ అవుతోంది. అయితే మణికంఠను కూడా ఎలిమినేట్​ (Bigg Boss Eviction) చేసి సీక్రెట్​ రూమ్​కి పంపిస్తారని టాక్ వినిపిస్తోంది​.

సీక్రెట్ రూమ్

మణికంఠ హౌజ్​లో ఎక్కువ ఎమోషనల్​ అవుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులు సీక్రెట్​ రూమ్​కు పంపిస్తే గత సీజన్లో గౌతమ్​ లా.. ఈ సీజన్​లో కూడా మణికంఠ 2.0 గా మారి వస్తాడని బిగ్​బాస్ భావిస్తున్నట్లు సమాచారం. ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *