నేటి నుంచి అమల్లోకి PM e-Drive స్కీమ్- వాహనాలపై భారీ డిస్కౌంట్స్

Mana Enadu : ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఈ వాహనాలపై భారీ డిస్కౌంట్లు అందించేందుకు సరికొత్త పథకం పీఎం ఇ-డ్రైవ్‌ అమల్లోకి తీసుకువచ్చింది. ఇవాళ్టి (అక్టోబర్ 1 2024) నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, ఈవీ ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.10,900 కోట్లతో తీసుకొస్తున్న ఈ పథకం 2024 అక్టోబర్‌ 1 నుంచి 2026 మార్చి 31 వరకు అమల్లో ఉండనుంది.

రాయితీ గల వాహనాలు ఇవే

పీఎం ఇ- డ్రైవ్‌ పథకంలో భాగంగా ఎలక్ట్రిక్‌ టూ వీలర్లు, త్రీ- వీలర్లు, ఇ- అంబులెన్సులు, ఇ-ట్రక్కులకు కేంద్ర సర్కార్ డిస్కౌంట్ కల్పిస్తుంది. ఈ పథకం అమల్లో ఉండనున్న రెండేళ్ల కాలంలో బస్సులకు అత్యధికంగా రూ.4,391 కోట్లు .. టూ- వీలర్లకు రూ.1772 కోట్లు వెచ్చించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్‌ టూ- వీలర్‌, త్రీ- వీలర్‌ కేటగిరీకి కిలోవాట్‌కు రూ.5,000, ఆ మరుసటి ఏడాది రూ.2,500.. 2024-25లో ఎలక్ట్రిక్‌ టూ-వీలర్ కు గరిష్ఠంగా రూ.10వేలు, ఇ- రిక్షాకు రూ.25వేలు చొప్పున గరిష్ఠంగా చెల్లించనుంది. ఆ మరుసటి ఏడాది 2025-26లో టూ- వీలర్‌కు రూ.5 వేలు, ఇ-రిక్షాలకు రూ.12,500 చొప్పున డిస్కౌంట్ లభిస్తుంది.

రెండేళ్ల పాటు అమల్లో

మొదటి సారిగా 2015 ఏప్రిల్‌ 1న ఈ పథకాన్ని ప్రారంభించారు. రెండేళ్ల పాటు అమల్లో ఉన్న ఈ స్కీమ్ తిరిగి 2019 ఏప్రిల్‌ 1న పునఃప్రారంభమైంది. 2024 మార్చి 31 వరకు అమల్లో ఉంది. ఆ తర్వాత ఎలక్ట్రిక్‌ టూవీలర్‌, త్రీవీలర్లకు మద్దతు ఇచ్చేందుకు మధ్యలో ఎలక్ట్రిక్‌ మొబలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ 2024ను ప్రకటించారు. ఈ స్కీమ్‌ సెప్టెంబర్‌తో 30తో ముగియగా.. అక్టోబర్ 1వ తేదీ నుంచి మరో రెండళ్ల పాటు పీఎం ఇ-డ్రైవ్‌ పథకం అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర సర్కార్.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *